ఫాంహౌస్లో స్టీఫెన్తో భేటీ: కి.మీ. మేర పోలీసు ఆంక్షలు! కేసీఆర్ అల్లం సాగు
మెదక్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ బుధవారం మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో భేటీ అయ్యారు.
వీరి భేటీ నేపథ్యంలో కేసీఆర్ ఫాం హౌస్ నుండి దాదాపు 5 కిలోమీటర్ల వరకు పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదని వార్తలు వస్తున్నాయి. ఓటుకు నోటు వ్యవహారం సంచలం సృష్టించిన విషయం తెలిసిందే. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు రేవంత్ రెడ్డి రూ.50 లక్షలు ఇవ్వబోతూ పట్టుబడ్డారు.
ఇది తెలుగు రాష్ట్రాలలో సంచలనం అయింది. నిన్నటి వరకు హైదరాబాదులో అధికారులు, పోలీసు బాసులతో భేటీ అయిన కేసీఆర్ మంగళవారం రాత్రి ఫాం హౌస్కు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా కాన్వాయ్లో వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు.

అల్లం సాగు చేయించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ముసురు ఉండటంతో పంటల సాగుకు ఆటంకం కలిగింది. ఖరీఫ్ పంటల సాగు నిమిత్తం గడిచిన 45 రోజుల్లో కేసీఆర్ ఆరుసార్లు వ్యవసాయ క్షేత్రానికి వచ్చారు.
సీఎం రాక తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఎస్పీ సుమతి, సిద్దిపేట ఆర్డీవో ముత్యం రెడ్డి తదితరులు ఫాంహౌస్కు తరలి వచ్చారు. పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. కాగా, స్టీఫెన్ సన్ ఫాంహౌస్కి వచ్చి మాట్లాడిన నేపథ్యంలో దాదాపు ఐదు కిలోమీటర్ల మేర పోలీసు ఆంక్షలు ఉంచారని వార్తలు రావడం గమనార్హం.
-
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..! -
ఇరాన్ పోరాటం వెనుక రహస్య ఆయుధం? యూఎస్-ఇజ్రాయెల్ కు చిక్కని సీక్రెట్..! -
జీహెచ్ఎంసీ వాసులకు బిగ్ న్యూస్.. వారి ఆస్తులు సీజ్ కు రంగం సిద్ధం! -
ఆ ఉద్యోగుల జీతాలు నిలిపివేత, ఐఏఎస్ ల నుంచి జిల్లా స్థాయి వరకు - నిర్ణయం వెనుక..!!












Click it and Unblock the Notifications