మంచి సందేశం ఉన్న చిత్రాలు రావాలి
Recommended Video

ఈ మధ్య సినిమాల్లో మెసేజ్ ఉండట్లేదు...?
తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ప్రపంచ తెలుగు మహా సభల కోసం రవీంద్రభారతి వేదికగా ఘనంగా ఏర్పాట్లు చేసారు ఈ సందర్బాన్ని పురస్కరించి సినిమాటోగ్రాఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రవీంద్రభారతిలోని కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు,
ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మామిడి హరికృష్ణ భాష సాంస్కృతిక డైరెక్టర్నీ అభినందిస్తూ, తెలుగు భాష తల్లి భాష, ఈరోజు పిల్లలు తెలుగుని పట్టించుకోవట్లేదు, తెలుగులో మాట్లాడటానికి ఇష్టపడట్లేదు.
ఇలాంటి తరుణంలో తల్లితండ్రులే తెలుగును నేర్పించాలి తలసాని అన్నారు. రవీంద్రభారతిలోని పైదిజయారాజ్ ప్రివ్యూ ధియేటర్ కొత్త సిని మేకర్స్ కోసం నిర్మించిది మంచి సందేశమున్న సినిమాలు రావాలి, ఇప్పుడు ఒక్క సినిమాల్లో కూడా మెస్సేజ్ ఉండట్లేదు, సందేశాత్మక చిత్రాలకు ప్రభుత్వం సహాయం చేస్తుంది అని అన్నారు.












Click it and Unblock the Notifications