షాకింగ్: గుండె కింద బద్దె పురుగులు.. పెంపుడు కుక్కలతో జాగ్రత్త!
పెంపుడు జంతువుల ద్వారా తినే ఆహారం కలుషితమైనప్పుడు మనిషి శరీరంలోను బద్దె పురుగులు(టేప్ వార్మ్స్) వ్యాప్తి చెందే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు.
హైదరాబాద్: పెంపుడు కుక్కలతో జాగ్రత్తగా ఉండాలని కిమ్స్ ఆసుపత్రి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటి ద్వారా తినే ఆహారం కలుషితమైనప్పుడు మనిషి శరీరంలోను బద్దె పురుగులు(టేప్ వార్మ్స్) వ్యాప్తి చెందే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు.
తాజాగా తీవ్ర అస్వస్థతతో కిమ్స్ ఆసుపత్రిని ఆశ్రయించిన ఓ పేషెంట్ శరీరంలో బద్దె పురుగులను డాక్టర్లు గుర్తించారు. పేషెంట్ గుండె కింద బద్దె పురుగులను చూసి డాక్టర్లే విస్మయం చెందారు. శస్త్ర చికిత్స ద్వారా గుండె నుంచి వాటిని తొలగించి అతని ప్రాణాలు కాపాడారు.

కిమ్స్ కార్డియోథోరాసిక్ శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ కె.వి.కృష్ణకుమార్ సోమవారం నాడు ఈ వివరాలు వెల్లడించారు. దీనిని హైడాటిడ్ డిసీజ్గా పిలుస్తారని చెప్పారు. సాధారణంగా కుక్కలు ఇతర పెంపుడు జంతువుల పొట్టలోని పేగుల్లో ఈ బద్దె పురుగులు ఉంటాయని, వాటిని దగ్గరకు తీసుకున్నప్పుడు.. వాటి ద్వారా తినే ఆహారం కలుషితమైనప్పుడు ఇవి మనిషి శరీరంలోకి చేరుతాయని అన్నారు.
మనిషి శరిరీంలో ఎక్కువగా ఊపిరితిత్తుల ప్రాంతంలోనే ఈ బద్దె పురుగులు నివాస స్థావరాలను ఏర్పరుచుకుంటాయని, కానీ తమ వద్దకు వచ్చిన పేషెంట్ కు గుండె కింది బాగంలో వీటిని గుర్తించామని తెలిపారు. గుండె కింద భాగంలో వీటిని గుర్తించడం అరుదైన విషయమని అన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications