విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎల్లలు లేని కళావైభవం: 'అమరావతి'కి తెలంగాణ చేయూత, విరాళాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళాలు సేకరించేందుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన కళాకారులు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. ఇందుకోసం కల్చలర్ సెంటర్ ఆఫ్ విజయవాడ (సిసివి) ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఓ శిబిరాన్ని నిర్వహిస్తోంది.

మూడు రోజుల పాటు విజయవాడలోని ఓ చాంబర్స్‌లో ఆర్ట్ బియాండ్ బౌండరీస్ పేరుతో కళాశిబిరాన్ని నిర్వహించనుంది. ఈ విషయాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త మహాలక్ష్మీ గ్రూప్ చైర్మన్, సిసివి వ్యవస్థాపకులు హరీష్ చంద్రప్రసాద్ ఓ ప్రకటనలో చెప్పారు.

Telangana artists to support capital Amaravati

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కళా శిబిరాన్ని ప్రారంభించనున్నారు. ప్రసిద్ధ చిత్రకారులు ఏలె లక్ష్మణ్ వంటి వారు తమ పెయింటింగులను ప్రదర్శించనున్నారు. ఈ పేయింటింగులను వేలం వేయడం ద్వారా ఆ డబ్బును ఏపీ నూతన రాజధాని అభివృద్ధికి అందిస్తారు.

కాగా, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఆహ్వానించనున్నారు. ఈ నెల 18వ తేదీన కెసిఆర్ ఇంటికి వెళ్లి చంద్రబాబు ఆహ్వానించనున్నారు.

ఈ శంకుస్థాపన రోజునే కెసిఆర్‌కు ఓ కార్యక్రమం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి కెటిఆర్ తదితరులు హాజరయ్యే అవకాశాలున్నాయి. శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానిస్తే తాము వెళ్తామని కెటిఆర్ చెప్పిన విషయం తెలిసిందే.

English summary
Telangana artists to support Andhra Pradesh capital Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X