RS Praveen Kumar: బీసీల రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలని ఆర్ఎస్పీ డిమాండ్.
బీసీల రిజర్వేషన్లు పెంచాలని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను50 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. 50 శాతానికి పైగా జనాభాకు 27 శాతం రిజర్వేషన్లు ఎలా సమాంజసం అని అన్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవమైన 26వ తేదీ నుంచి వరుస ఆందోళనలు హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లు.. పెరిగిన జనాభాకు అనుగుణంగా పెంచాలని డిమాండ్ చేశారు.
90 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు బీసీ కులాల గణన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. 1953లో ఏర్పాటైన కాలేల్కర్ కమిషన్, 1979లో ఏర్పాటైన మండల్ కమిషన్ సిఫార్సులను పూర్తిగా అమలు చేయకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు బీసీలను అన్యాయం చేస్తున్నాయని విమర్శంచారు.ఎలాంటి జనగణన లేకుండానే ఈడబ్ల్యూఎస్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి 103వ రాజ్యాంగ సవరణ చేసినపుడు, బీసీ రిజర్వేషన్ల కోసం ఎందుకు సవరణ చేయరని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార నిలదీశారు.
మరోవైపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు అయింది. కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10% రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగంలోని 103వ సవరణ రాజ్యాంగ చెల్లుబాటును సమర్థిస్తూ ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెల్లడించింది. అయితే ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ పిటిషన్ వేశారు. రాజ్యాంగంలోని 103వ సవరణను సమర్థిస్తూ 2022, నవంబర్ 7న జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ జెబి పార్దివాలా జారీ చేసిన ఉత్తర్వులను సమీక్షించాలని పిటిషన్ కోరారు.
వెనుకబడిన తరగతులను మినహాయించాలనే కారణంతో సవరణను పక్కన పెట్టిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి యు యు లలిత్, జస్టిస్ రవీంద్ర భట్ల వైఖరిని తాము అంగీకరిస్తున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. "భారత రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని మార్చే 103వ రాజ్యాంగ సవరణ తీవ్ర వైరుధ్యం. ఇది ఇంద్ర సాహ్నీ & ఓర్స్. V. యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో SC తీర్పుకు విరుద్ధం తరగతిని ఆర్థిక ప్రమాణాలకు సంబంధించి మాత్రమే. ప్రత్యేకంగా నిర్ణయించడం సాధ్యం కాదు" అని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ రిజర్వేషన్ దేశంలో సమానత్వ కోడ్ను ఉల్లంఘించడమేనని, ఇది వివక్షకు దారితీస్తుందని పిటిషనర్ పేర్కొన్నారు. మన దేశంలో ఎంతోకాలంగా రిజర్వేషన్లు అమల్లో ఉన్నప్పటికీ.. ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన తరగతులకు కల్పించే మొత్తం రిజర్వేషన్లు కేవలం 47.46శాతమేనని అన్నారు. ఇప్పుడు కేవలం ఈడబ్ల్యూఎస్కే 10శాతం రిజర్వేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో చాలా కాలంగా రిజర్వేషన్లు అమలులో ఉన్నప్పటికీ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల మొత్తం శాతం 47.46% మాత్రమేనని రివ్యూ పిటిషన్లో పేర్కొన్నారు. 3:2 మెజారిటీ వీక్షణతో సుప్రీం కోర్ట్ రాజ్యాంగ బెంచ్ ఇటీవల EWSకి 10% అందించే 103వ రాజ్యాంగ సవరణను సమర్థించింది. అయితే మాజీ CJI లలిత్తో పాటు జస్టిస్ S రవీంద్ర భట్ EWS కోటాను వెనుకబడిన తరగతులను మినహాయించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.