పండితులు, ఉద్యోగుల అభ్యంతరం: దీపావళి సెలవుల్లో మార్పు
తెలంగాణ ప్రభుత్వం దీపావళి సెలవుల్లో మార్పులు చేసింది. ఐచ్ఛిక సెలవు అక్టోబర్ 18కి, సాధారణ సెలవు అక్టోబర్ 19కి మారుస్తున్నట్లు సోమవారం వెల్లడించింది.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం దీపావళి సెలవుల్లో మార్పులు చేసింది. ఐచ్ఛిక సెలవు అక్టోబర్ 18కి, సాధారణ సెలవు అక్టోబర్ 19కి మారుస్తున్నట్లు సోమవారం వెల్లడించింది.
అంతకుముందు అక్టోబర్ 17న ఐచ్ఛిక సెలవు, 18న దీపావళి సెలవుగా ప్రకటించారు. అయితే దీనిపై పండితులు, అధికారులు, ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

అంతేగాక, పండగ సెలవు తేదీని 19కి మార్చాలంటూ పలువురు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో సెలవుల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.












Click it and Unblock the Notifications