విద్యార్థులకు అలర్ట్: ఎంసెట్ పరీక్ష తేదీల్లో మార్పులు, కొత్త షెడ్యూల్ ఇదే
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్(TS EAMCET) పరీక్ష షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మే 7 నుంచి 11 వరకు జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు వెల్లడించారు.
నీట్(NEET), టీఎస్పీఎస్సీ(TSPSC) పరీక్షల కారణంగానే ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీంల షెడ్యూల్లో ఎలాంటి మార్పులూ లేవని.. మే 10, 11 తేదీల్లోనే ఈ పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని తెలిపారు.

కాగా, ఎంసెట్ దరఖాస్తుల గడవు ఏప్రిల్ 4తో ముగియనుంది. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 30 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి తెలిపింది.
ఇక గురువారం సాయంత్రం వరకు తెలంగాణ ఎంసెట్(ఇంజినీరింగ్)కు 1,14,989 మంది దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్కు 65,033 మంది, రెండింటికీ 218 మంది విద్యార్థులు చొప్పున మొత్తంగా 1,80,240 మంది దరఖాస్తు చేసుకున్నారు.
-
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!!












Click it and Unblock the Notifications