ఓటు వేసి సెల్ఫీ తీసి, పోలీసులకు చిక్కాడు: సోషల్ మీడియాలో మరో వీడియో హల్చల్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మధ్యాహ్నం మూడు గంటల వరకు దాదాపు 56 శాతం పోలింగ్ నమోదయింది. ఐదు గంటల వరకు ఓటింగ్కు అవకాశం ఉంటుంది. ఐదు గంటల లోపు ఎవరైతే ఆయా పోలింగ్ బూత్లలోని క్యూ లైన్లలో నిలబడతారో వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఇదిలా ఉండగా, పోలింగ్ కేంద్రాలలోకి మొబైల్ ఫోన్లు తీసుకు రావొద్దని ఈసీ ముందే చెప్పింది.
ఓటు వేసేటప్పుడు గోప్యత ఉండాలని, ఫోటో తీసినా, సెల్ఫీ దిగినా కఠిన చర్యలు తప్పవని ఈసీ ముందే హెచ్చరించింది. కానీ రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. శివశంకర్ అనే వ్యక్తి ఓటు వేసి ఫోటో తీసుకున్నాడు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ఇదిలా ఉండగా, మరో వీడియో కూడా వైరల్గా మారింది. ఎవరో వృద్ధులు ఓటు వేసే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ఉన్నవారు ఎవరో.. ఇది ఇది అంటూ చూపారు. ఆమె చేయి ఓ గుర్తు మీదకు వెళ్లింది. అక్కడ వెనుకవైపు ఉన్న వారు ఇది.. ఇది అంటూ మరోచోట ఓటు వేయించారు. అయితే ఓటువేసే వారు వృద్ధులు కాబట్టి వారు ఓ గుర్తు చెప్పి మరో గుర్తుకు ఓటు వేసే ప్రయత్నం చేయగా వారు సరిదిద్దారా.. లేక ఉద్దేశ్యపూర్వకంగా చేశారా మాత్రం తెలియరాలేదు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications