Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కరెంట్ బిల్: కట్టిన డబ్బులు వాపస్.. ఎలాగో చూడండి!

రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడకుండా విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పాత విద్యుత్ ఛార్జీలనే కొనసాగిస్తున్నట్లు బుధవారం విడుదల చేసిన టారిఫ్ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీనివల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఉపశమనం లభించనుంది. మరోవైపు, విద్యుత్ ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని భారీగా పెంచుతూ డిస్కంలను ఆదేశించింది.

విద్యుత్ షాక్‌ తగిలి ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే, వారి కుటుంబానికి ఇచ్చే పరిహారాన్ని ప్రస్తుతమున్న రూ. 5 లక్షల నుంచి రూ. 8 లక్షలకు పెంచాలని ఈఆర్‌సీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిబంధన ఈ నెల 1వ తేదీ నుంచే అమలులోకి రానుంది. ముఖ్యంగా, వినియోగదారుల పొరపాటు వల్ల ప్రమాదం జరిగినా సరే, ఈ పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఒకవేళ ప్రమాదం జరిగిన రెండు నెలల్లోగా పరిహారం అందకపోతే, అందుకు గల కారణాలను డిస్కంలు లిఖితపూర్వకంగా తెలపాలని ఆదేశించింది.

Telangana ERC Orders Discoms to Refund Excess Charges to Rooftop Solar and HT Users New Tariff Rules 2026

అదనపు వసూళ్ల వాపసు.. సర్దుబాటుకు ఆదేశం..

డిస్కంలు గతంలో వినియోగదారుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన అదనపు సొమ్మును తిరిగి ఇవ్వాలని ఈఆర్‌సీ ఆదేశించింది.

  • హెచ్‌టీ (HT) వినియోగదారులు: అనుమతించిన లోడ్ కంటే అదనంగా వాడినందుకు వసూలు చేసిన మొదటి రెండు నెలల అదనపు బిల్లును వచ్చే ఆరు నెలల బిల్లుల్లో సర్దుబాటు చేయాలి.
  • సౌర విద్యుత్ (Rooftop Solar): సోలార్ ప్లాంట్లు ఉండి, అదనపు యూనిట్లు వాడినప్పుడు అధిక స్లాబ్ రేట్ల ప్రకారం వసూలు చేసిన సొమ్మును రాబోయే 3 నెలల బిల్లుల్లో వెనక్కి ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!

ట్రూఅప్‌ ఛార్జీల వాయిదా.. ప్రభుత్వ భరోసా..

గత రెండేళ్లలో (2022-24) పెరిగిన అదనపు వ్యయం రూ. 7,635 కోట్లను 'ట్రూఅప్‌ ఛార్జీల' రూపంలో వసూలు చేసేందుకు ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. అయితే, ఈ భారాన్ని ప్రజలపై వేయవద్దని, దీనిపై తామే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో.. రైతు డిస్కం ఏర్పాటు ప్రక్రియ ముగిసేవరకు ఈ వసూళ్లను ఈఆర్‌సీ వాయిదా వేసింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో డిస్కంలకు ఏర్పడనున్న రూ. 15,105 కోట్ల లోటులో, రూ. 14 వేల కోట్లను ప్రభుత్వం భరించనుంది.

కరెంట్ అప్పు తీసుకుంటున్నారు! హిస్టరీలోనే ఫస్ట్ టైమ్..
కరెంట్ అప్పు తీసుకుంటున్నారు! హిస్టరీలోనే ఫస్ట్ టైమ్..

డిస్కంల వ్యయాలకు కోత..

ఈ ఏడాది కరెంటు కొనుగోలు వ్యయం రూ. 54,567 కోట్లు అవుతుందని డిస్కంలు అంచనా వేయగా, ఈఆర్‌సీ దానిని రూ. 49,230 కోట్లకే పరిమితం చేసింది. అలాగే మొత్తం వ్యయాలను రూ. 72,996 కోట్ల నుంచి రూ. 64,950 కోట్లకు కుదించింది. వినియోగదారులకు సేవలను మెరుగుపరచడంతో పాటు, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని డిస్కంలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+