కరెంట్ బిల్: కట్టిన డబ్బులు వాపస్.. ఎలాగో చూడండి!
రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడకుండా విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పాత విద్యుత్ ఛార్జీలనే కొనసాగిస్తున్నట్లు బుధవారం విడుదల చేసిన టారిఫ్ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీనివల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఉపశమనం లభించనుంది. మరోవైపు, విద్యుత్ ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని భారీగా పెంచుతూ డిస్కంలను ఆదేశించింది.
విద్యుత్ షాక్ తగిలి ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే, వారి కుటుంబానికి ఇచ్చే పరిహారాన్ని ప్రస్తుతమున్న రూ. 5 లక్షల నుంచి రూ. 8 లక్షలకు పెంచాలని ఈఆర్సీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిబంధన ఈ నెల 1వ తేదీ నుంచే అమలులోకి రానుంది. ముఖ్యంగా, వినియోగదారుల పొరపాటు వల్ల ప్రమాదం జరిగినా సరే, ఈ పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఒకవేళ ప్రమాదం జరిగిన రెండు నెలల్లోగా పరిహారం అందకపోతే, అందుకు గల కారణాలను డిస్కంలు లిఖితపూర్వకంగా తెలపాలని ఆదేశించింది.

అదనపు వసూళ్ల వాపసు.. సర్దుబాటుకు ఆదేశం..
డిస్కంలు గతంలో వినియోగదారుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన అదనపు సొమ్మును తిరిగి ఇవ్వాలని ఈఆర్సీ ఆదేశించింది.
- హెచ్టీ (HT) వినియోగదారులు: అనుమతించిన లోడ్ కంటే అదనంగా వాడినందుకు వసూలు చేసిన మొదటి రెండు నెలల అదనపు బిల్లును వచ్చే ఆరు నెలల బిల్లుల్లో సర్దుబాటు చేయాలి.
- సౌర విద్యుత్ (Rooftop Solar): సోలార్ ప్లాంట్లు ఉండి, అదనపు యూనిట్లు వాడినప్పుడు అధిక స్లాబ్ రేట్ల ప్రకారం వసూలు చేసిన సొమ్మును రాబోయే 3 నెలల బిల్లుల్లో వెనక్కి ఇవ్వాలని స్పష్టం చేసింది.
ట్రూఅప్ ఛార్జీల వాయిదా.. ప్రభుత్వ భరోసా..
గత రెండేళ్లలో (2022-24) పెరిగిన అదనపు వ్యయం రూ. 7,635 కోట్లను 'ట్రూఅప్ ఛార్జీల' రూపంలో వసూలు చేసేందుకు ఈఆర్సీ ఆమోదం తెలిపింది. అయితే, ఈ భారాన్ని ప్రజలపై వేయవద్దని, దీనిపై తామే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో.. రైతు డిస్కం ఏర్పాటు ప్రక్రియ ముగిసేవరకు ఈ వసూళ్లను ఈఆర్సీ వాయిదా వేసింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో డిస్కంలకు ఏర్పడనున్న రూ. 15,105 కోట్ల లోటులో, రూ. 14 వేల కోట్లను ప్రభుత్వం భరించనుంది.
డిస్కంల వ్యయాలకు కోత..
ఈ ఏడాది కరెంటు కొనుగోలు వ్యయం రూ. 54,567 కోట్లు అవుతుందని డిస్కంలు అంచనా వేయగా, ఈఆర్సీ దానిని రూ. 49,230 కోట్లకే పరిమితం చేసింది. అలాగే మొత్తం వ్యయాలను రూ. 72,996 కోట్ల నుంచి రూ. 64,950 కోట్లకు కుదించింది. వినియోగదారులకు సేవలను మెరుగుపరచడంతో పాటు, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని డిస్కంలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది.
-
పులుల గర్జనతో గ్రీన్ తెలంగాణ! నల్లమల అడవుల్లో అరుదైన రికార్డ్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
తెలంగాణాకు కొత్త టెన్షన్.. క్యాన్సర్ కేసులపై ఐసీఎంఆర్ షాకింగ్ నివేదిక! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?














Click it and Unblock the Notifications