మాస్టర్ ప్లాన్ ఎలా?: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: కళాభారతి నిర్మాణం కోసం హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో పద్నాలుగు ఎకరాల స్థలాన్ని సాంస్కృతిక శాఖకు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 73ని సవాలు చేస్తూ ఉమ్మడి హైకోర్టులో మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
ఈ నిర్మాణాన్ని సవాలు చేస్తూ ఇప్పటికే దాఖలైన పిటిషన్పై విచారణ కొనసాగుతోంది. ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ కార్యదర్శి ఒఎం దేబరా తాజాగా దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ఎస్వి భట్లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఎన్టీఆర్ స్టేడియం మాస్టర్ ప్లాన్కు సంబంధించిన విషయమై అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది.

కాగా, ఎన్టీఆర్ స్టేడియంలోని 14 ఎకరాల్లో కేవలం ఆరు ఎకరాల్లోనే కళాభారతి నిర్మిస్తామని మిగతా స్థలంలో పార్కింగ్, మొక్కల పెంపకం, వాకర్స్ పాత్ వే వంటివి ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తరఫున అడ్వోకేట్ జనరల్ హైకోర్టుకు ఇటీవల తెలిపారు.
ఈ మైదానానికి సమీపంలోని వ్యాయామ కళాశాలకు పదెకరాల స్థలం ఉందని, భవన నిర్మాణం పోను మిగతా దాంట్లో స్థానిక పిల్లలు సాయంత్రం పూట, సెలవు దినాల్లో ఆడుకోవచ్చని తెలిపింది. ఈ విషయాలను పేర్కొంటూ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications