డేరా సచ్చా సౌదా గుర్మీత్ రామ్ రహీం సింగ్కు తెలంగాణ ప్రభుత్వం షాక్!
నల్గొండ జిల్లాలో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ గతంలో కొనుగోలు చేసిన తొమ్మిది ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
హైదరాబాద్: నల్గొండ జిల్లాలో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ గతంలో కొనుగోలు చేసిన తొమ్మిది ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
చూస్తూ ఊరుకునేది లేదు: డేరా అల్లర్లపై ప్రధాని మోడీ ఆగ్రహం
ఫిర్యాదులు రావడంతో
ఈ భూమి అసైన్డ్ లాండ్ అని నిర్ధారణ కావడం, చుట్టుపక్కల రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో చిట్టాల మండలం ఎలిమినేడులో 65వ జాతీయ రహదారిపై ఉన్న భూమిని స్వాధీనం చేసుకున్నట్టు తహసీల్దార్ వెల్లడించారు.
చుట్టుపక్కల రైతులు ఇబ్బంది
ఈ భూముల చుట్టూ 10 అడుగుల గోడ కట్టడం వల్ల చుట్టుపక్కల పొలాలు ఉన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, కాల్వ నీరు పోకుండా అడ్డంగా ప్రహరీ నిర్మించడంతో పంట పొలాలు మునిగిపోతున్నాయని స్థానిక రైతులు వాపోతున్నారు.
అసైన్డ్ భూమి
నల్గొండ జిల్లాలో 2008 నుంచి 2015 మధ్య రూ.30 కోట్ల విలువైన 55 ఎకరాల భూమిని గుర్మీత్ కొనుగోలు చేశాడు. ఈ భూమి ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్లు పురుషోత్తమ్ లాల్, కిషన్ సేవాధార పేరిట ఉంది. ఇందులో 9 ఎకరాల అసైన్డ్ భూమి కూడా గుర్మీత్ ట్రస్ట్ పేరిట ఉందని తెలుసుకున్న రెవెన్యూ శాఖ, నోటీసులు పంపింది.
సేవా కార్యక్రమాలు అని చెబుతున్నప్పటికీ..
ఈ భూమిని కొనుగోలు చేసి, సేవా కార్యక్రమాల నిమిత్తం ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన వర్గం చెబుతున్నా, ఒక్కసారి కూడా గుర్మీత్ ఇక్కడికి రాలేదు. పంచాయతీకి బోరును అద్దెకు ఇచ్చి నెలకు రూ.5వేలు వసూలు చేస్తున్నారు.