సామాన్యులు, విద్యార్థులపై మరో భారం - ఛార్జీలు ఏకంగా 50 శాతం పెంపు..!!
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యుల పై ఈ నిర్ణయం భారంగా మారనుంది. రాష్ట్రంలో మీ సేవ సర్వీస్ ఛార్జీలను భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీ సేవ నిర్వహకుల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు ప్రభుత్వం ధరలను పెంచింది. వినియోగ ఛార్జీలు 50 శాతం పెంచింది. పెంచిన ఛార్జీలను ఏప్రిల్ 1 (బుధవారం) నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
తమకు వచ్చే కమిషన్ను పెంచాలని ప్రభుత్వాన్ని మీ సేవ నిర్వహకులు ఎప్పటినుంచో కోరుతున్నారు. కరెంట్, ఇంటర్నెట్, సిబ్బంది ఖర్చులు పెరిగిన క్రమంలో పెంచాలని కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇన్ కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ గతంలో రూ.45 నుంచి రూ.55 వరకు ఉండగా.. ఇప్పుడు రూ.80కి పెరిగింది. ఇక స్థానిక ధృవీకరణ పత్రంకు రూ.80కి పెరిగింది. ఇక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్కు గతంలో రూ.40 నుంచి రూ.45 వరకు ఉండగా.. ఇప్పుడు రూ.62కి చేరుకుంది. గతంలో కనిష్టంగా ఉన్న రూ.35 సర్వీస్ ఛార్జీలను ఇప్పుడు రూ.62కి పెంచారు. ఏ కేటగిరీ సర్టిఫికెట్ ప్రింట్ వంటి వాటికి రూ.62 వసూలు చేయనున్నారు. ఇక ఆర్టీఏ, కరెంట్ బిల్లు చెల్లింపులు, ప్రభుత్వ అప్లికేషన్లపై కూడా అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. ప్రభుత్వం అందించే సర్వీసెస్పై 18 శాతం జీఎస్టీ విధించనుంది. కేటగిరీ-ఏ విభాగంలో రూ.35 నుంచి రూ.62కి, బీ కేటగిరీలో రూ.45 నుంచి రూ.80కి పెంచింది.

ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ
కాగా, తెలంగాణ ప్రభుత్వం పౌర సేవలను మరింత సులభతరం చేయటానికి వాట్సప్ మీ సేవ సేవలను ప్రారంభించింది. మీ సేవ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా వాట్సప్లోనే మీ సేవ సేవలను పొందవచ్చు. దాదాపు 581 రకాల సేవలను వాట్సప్లోనే పొందవచ్చు. ఇందు కోసం 8096958096 నెంబర్ను ప్రవేశపెట్టింది. ఆ నెంబర్ ద్వారా 24 గంటల పాటు ప్రభుత్వ శాఖలకు చెందిన డాక్యుమెంట్స్ పొందే వెసులుబాటు కల్పించింది. దీని ద్వారా దాదాపు 10కిపైగా శాఖలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు పొందవచ్చు. తాజా నిర్ణయంతో మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు చెల్లించే కమీషన్ కూడా గతం కంటే భారీగా పెరిగింది. గతంలో కేటగిరీ-ఏ సేవలు అందించినప్పుడు చెల్లించిన రూ.35 ఫీజుపై రూ.13 కమీషన్గా ఇచ్చేవారు. ఇప్పుడు రూ.62కి పెంచడం వల్ల కమీషన్ రూ.40.34కి చేరింది. దీనివల్ల వారికి మరింత ఆదాయం సమకూరనుంది.
-
తెలంగాణా గ్రామాలకు కేంద్రం అదిరిపోయే శుభవార్త.. రూ.247.9 కోట్ల విడుదల -
బిగ్ షాక్.. తెలంగాణలో రేపటి నుంచి చికెన్ షాపులు బంద్ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్













Click it and Unblock the Notifications