రేపు సెలవు ప్రకటించిన సర్కార్, వీరికే వర్తింపు..!!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్దం అవుతోంది. ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. హోరా హోరీగా ప్రచారం నిర్వహించాయి. పోలింగ్ సమయం సమీపిస్తున్న వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్ధులు శక్తి మేర ప్రయత్నిస్తున్నారు. అటు రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇదే సమయంలో పోలింగ్ వేళ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే, సెలవు వర్తింపు విధానాల పైన ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది.
తెలంగాణ మున్సిపల్ పోలింగ్ కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసారు. రాజకీయ నేతల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. పోలింగ్ వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి (బుధవారం) పోలింగ్ రోజును సెలవుగా ప్రకటించింది సర్కార్. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ఫ్యాక్టరీలు, షాపులు, పరిశ్రమలకు సెలవు వర్తించనుంది. అంతేకాకుండా, మున్సిపాలిటీల పరిధిలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు ఈ సెలవు వర్తించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మాత్రమే ఈ సెలవు వర్తించనుంది.

పోలింగ్ కు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు
కాగా, హైదరాబాద్ లో పని చేస్తున్న ఓటింగ్ జరుగుతున్న ప్రాంతాల ఉద్యోగులకు కంపెనీలు ప్రత్యేకంగా సెలవు ఇస్తున్నాయి. దీంతో, ఓటు వేసేందుకు సొంత ప్రాంతాలకు బయల్దేరు తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరుగనుంది. మొత్తం 12,930 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల కోసం 8,203 పోలింగ్ కేంద్రాలు, 16,301 బాలెట్ బాక్సులను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. రేపు (ఫిబ్రవరి 11) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న ఫలితాలు వెల్లడి కానున్నాయి. పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ సమయంలో మద్యం షాపులు మూసేయడంతో పాటు, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోనున్నారు. స్థానిక ఎన్నికలు కావటంతో భారీగా పోలింగ్ జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications