గ్రూప్-1 కేసులో హైకోర్టు సంచలన తీర్పు
హైకోర్టు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై సంచలన తీర్పును వెలువరించింది. మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని కొంతమంది అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన కోర్టు, గతంలో ప్రకటించిన మెయిన్స్ ఫలితాలను రద్దు చేసింది. దీంతో పాటు, గ్రూప్-1 మెరిట్ జాబితాను కూడా రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు తీర్పు ప్రకారం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుగా పేపర్లను మళ్లీ మూల్యాంకనం చేసి, దాని ఆధారంగానే కొత్త ఫలితాలను ప్రకటించాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే, తిరిగి మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది.

గతంలో జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకనంలో పారదర్శకత లేదని అభ్యర్థులు ఆరోపించారు. ఈ ఆరోపణలను పరిశీలించిన ధర్మాసనం అభ్యర్థుల వాదనలో పారదర్శకత లేదని అంగీకరించింది. ఈ నేపథ్యంలో, అభ్యర్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ తీర్పు ద్వారా టీజీపీఎస్సీకి కొత్త సవాల్ ఎదురైంది. వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేసి, అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు టీజీపీఎస్సీపై ఉంది. ఈ సంచలన తీర్పు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలకు సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థులలో కొత్త ఆశలను నింపింది.












Click it and Unblock the Notifications