Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాసరలో వీఐపీ వాహనాలకు సైతం నో ఎంట్రీ

తెలంగాణలో ఆలయాల జీర్ణోద్ధారణ, అక్కడి పరిపాలన, లక్షలాది మంది భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. తిరుమల తరహాలో ఆలయాలను అభివృద్ధి చేయాలని, అక్కడి విధానాలను ఆదర్శంగా తీసుకుని, ఆగమ శాస్త్రాల ప్రకారం కొత్త నిబంధనలను రూపొందించాలని అధికారులకు నిర్దేశించారు.

నిర్మల్ జిల్లా గోదావరి నది ఒడ్డున వెలిసిన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని ప్రభుత్వం 225 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తోంది. రేపు ఈ ఆలయ అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారులు ఆలయ మాస్టర్ ప్లాన్‌పై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆలయ సమగ్ర అభివృద్ధికి అయ్యే అంచనా వ్యయం గురించి వెల్లడించారు. ఈ మాస్టర్ ప్లాన్‌కు రేవంత్ రెడ్డి పలు సవరణలను సూచించారు.

Telangana Plans Uniform Temple Rules Inspired by Tirumala CM Revanth Reddy orders Uplift Devotion

అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దేవాలయాల్లో ఆధ్యాత్మికత, పవిత్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రార్థనా మందిర ప్రాంగణాల్లో రాజకీయ కార్యకలాపాలు, సభలు, ప్రదర్శనలు పూర్తిగా నిషేధించాలని స్పష్టం చేశారు. బసర ఆలయ అభివృద్ధి పనులను సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు కట్టుబడి పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో వాహనాల రద్దీని నియంత్రించడం, ప్రముఖులు, వీఐపీల వాహనాలను సైతం ఆలయ సముదాయం వెలుపలే పార్క్ చేయాలని నిబంధనలు విధించారు.

అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, లోపాలుంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సువిశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. భక్తుల విశ్వాసాలు దెబ్బతినకుండా ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించారు.

తిరుమల తిరుపతి తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు తావు లేకుండా నిబంధనలు ఉండాలని చెప్పారు. ఆలయ పరిసరాల్లో ఎలక్ట్రికల్ వాహనాలను మాత్రమే వినియోగించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు పీ సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+