తుఫాన్ దెబ్బకు మబ్బేసిన తెలంగాణా... ఈ జిల్లాలకు వర్షసూచన!
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఫెంగల్ తుఫాన్ గా రూపాంతరం చెంది అది పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిన విషయం తెలిసిందే. ఇక ఈ తుఫాను ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంతో పాటు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణాలో మోస్తరు వర్షాలు
ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలు వర్షాల ధాటికి చిగురుటాకులా వణికి పోతున్నాయి. ప్రస్తుతం చలికాలంలో చలి తీవ్రత పెరగడంతో పాటు విపరీతమైన చలిగాలులు వీస్తున్న వేళ వర్షాలు కూడా కురవడంతో తెలంగాణ వాసులు ఇబ్బంది పడుతున్నారు. నేడు తెలంగాణలోని పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

నేడు ఈ జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు
పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను కూడా జారీ చేశారు. నేడు భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, జనగామ,, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాల కారణంగా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచన
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక తుఫాను ప్రభావంతో హైదరాబాద్ నగరంలో కూడా వాతావరణం ఒక్కసారిగా మారింది. గత రెండు రోజులుగా హైదరాబాద్లోనూ ఆకాశం మేఘావృతమై ఉంది. ఇదిలా ఉంటే ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఆదివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసాయి.
పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
ఇటు హైదరాబాద్ నగరంలో కూడా పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసాయి. ఇక చలికాలంలో కురుస్తున్న ఈ వర్షాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. డిసెంబర్ 3వ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎటువంటి హెచ్చరికలు లేవని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications