తెలంగాణాలో అధికార కాంగ్రెస్ ఆందోళనల బాట.. ఎందుకంటే!
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం పథకాన్ని పేరు మారుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపైన కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. జాతీయ ఉపాధి హామీ చట్టం పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించి వికసిత్ భారత్ జి.రామ్.జి పేరు తో కొత్త పథకాన్ని తెస్తూ బిజెపి నిర్ణయం తీసుకోవడంపైన కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పేరు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 2005లో యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ నిరసనలు
తమ హయాంలో తీసుకువచ్చిన ఈ చట్టం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడం కావాలని బిజెపి చేస్తున్న కుట్ర అని , కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తీరును నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ క్యాడర్ కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు అధికార పార్టీ శ్రీకారం చుట్టింది.

రేపు హైదరాబాద్ లో నిరసనలు
రేపు శనివారం నాడు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి దగ్గర ఉన్న గాంధీవిగ్రహం వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు నే కొనసాగించాలని ప్రధానంగా డిమాండ్ చేయనున్నారు. రేపు శనివారం ఉదయం 10గంటలకు సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి వద్ద ఉన్న మహాత్మగాంధీ విగ్రహం వద్ద మహాత్మ గాంధీ చిత్రపటాలతో బీజేపీ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రదర్శన చేయనున్నారు.
ఎల్లుండి జిల్లాలలో నిరసనలు
ఎల్లుండి జిల్లాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించి బిజెపి తీరును ఎండగట్టాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఆదివారం నాడు మహాత్మా గాంధీ చిత్రపటాలతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని బీజేపీ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్యాడర్ కు పిలుపునిచ్చారు. దీంతో రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలను నిర్వహించనుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగానూ కాంగ్రెస్ ఈ నిర్ణయం పట్ల తమ నిరసన వ్యక్తం చేస్తుంది.
-
దానం నాగేందర్కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications