కెసిఆర్కు లెక్క పంపిస్తా: శ్రవణ్, బాధేస్తోంది: తలసాని రిజైన్పై నాగం
హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల మారణ హోమం జరుగుతుంటే, ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని, తాను సీఎం కెసిఆర్కు ఆత్మహత్యల వివరాలు పంపిస్తానని కాంగ్రెస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్ కుమార్ సోమవారం మండిపడ్డారు. కేంద్ర నేర నమోదు సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రభుత్వం మోసపూరిత లెక్కలు ఏమిటో అర్థమవుతోందన్నారు.
వెయ్యి మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కెసిఆర్ ప్రభుత్వం కేవలం 90 మందేనని లెక్కలు చెప్పడం దారుణమన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలను ముఖ్యమంత్రి కెసిఆర్కు తాను పంపిస్తానని దాసోజు శ్రవణ్ అన్నారు.

ఆత్మహత్యలు పెరిగాయి: రావుల
తెలంగాణ రాష్ట్రం వచ్చాకే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని టిడిపి నేత రావుల చంద్రశేఖర రెడ్డి సోమవారం అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించే సమయం ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులకు లేదా అన్నారు.
రాష్ట్రంలో 898 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, ఇప్పటి వరకు కెసిఆర్ ఒక్క కుటుంబాన్ని కూడా ఎందుకు పరామర్శించలేదన్నారు. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ కాళ్లు ఫాంహౌస్ దాటడం లేదని ఎద్దేవా చేశారు. ఆత్మహత్యల నివారణకు టిఆర్ఎస్ ఏం చర్యలు తీసుకోవడం లేదన్నారు.
హైదరాబాద్ ముఖ్యమంత్రా: తమ్మినేని
కార్మికుల పట్ల కెసిఆర్ వైఖరి సరిగా లేదని సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. జిహెచ్ఎంసి కార్మికులకు వేతనాలు పెంచి, ఇతర జిల్లాల కార్మికుల గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కెసిఆర్ హైదరాబాదుకే ముఖఅయమంత్రా లేక తెలంగాణకా చెప్పాలన్నారు. కెసిఆర్ వైఖరికి నిరసనగా బస్సుయాత్ర చేపట్టామన్నారు.
బాధేస్తోందన్న నాగం
ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే బాధ కలుగుతోందని బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో నైతిక విలువలకు టిఆర్ఎస్ తిలోదకాలు ఇచ్చిందని మండిపడ్డారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా ఎక్కడకు పోయిందో చెప్పాలన్నారు. స్పీకర్, గవర్నర్ తక్షణమే తలసానిని అనర్హుడిగా ప్రకటించాలన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications