"పవన్ కల్యాణ్ పుట్టక ముందే... కించపరిస్తే ఊరుకునేది లేదు"
హైదరాబాద్ : కాకినాడలో జరిగిన సీమాంధ్ర ఆత్మగౌరవ సభలో తెలంగాణ విషయంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా విమర్సలు వస్తున్నాయి. పోరాటాలు, త్యాగాలు, ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్ పుట్టకముందే ప్రత్యేక రాష్ట్రోద్యమం ప్రారంభమైందన్న సత్యాన్ని గ్రహించాలని తెలంగాణ రాష్ట్ర సినిమా అభిమానుల ఐక్య వేదిక అధ్యక్షుడు పూర్ణచందర్ రావు అన్నారు.
కాకినాడలో ఇటీవల జరిగిన సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో ఉమ్మడి రాష్ట్రాన్ని గడ్డం గీసినంత సులభంగా విడగొట్టారంటూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హైదరాబాదులోని సోమాజిగూడలో ప్రకటన విడుదల చేశారు. దేశ చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగిన ఉద్యమం తెలంగాణలో సాగిందని, ఆ చరిత్రను పవన్ తెలుసుకోవాలని ఆయన అన్నారు.

జైఆంధ్ర ఉద్యమంలో చనిపోయిన వారిగురించి ప్రస్తావించిన పవన్ తెలంగాణ కోసం ఆత్మత్యాగాలు చేసిన వారి గురించి మాట్లాడకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. సినిమా వాళ్లలో ఎక్కువ మంది సీమాంధ్రుల పక్షపాతులేనన్న సత్యం పవన్ కల్యాణ్ వ్యాఖ్యల ద్వారా స్పష్టమైందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం కోసం పవన్ ఉద్యమిస్తే సాటి తెలుగు వారిగా మద్ధతునిస్తామని, కానీ.. తెలంగాణను కించపరిస్తే ఊరుకు నేది లేదన్నారు. ఇప్పటికైనా పవన్ మాట్లాడే ముందు చరిత్రను తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
ఉస్తాద్కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్లో సందడి !! -
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications