Weather Report: తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి..
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల తక్కువ ఉష్ణాగ్రత నమోదు అవుతుంది. గత ఐదేళ్లతో పోలిస్తే ఈసారి అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోద అవుతున్నాయి. వాతావరణశాఖ చెబుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం తుఫాన్ కారణంగా ఉష్ణాగ్రతలు సాధారణంగానే నమోదు అయ్యాయి.
ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో చలి తీవ్రత పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ చెబుతుంది. శుక్రవారం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారిలో 6.8 డిగ్రీ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అయింది.రంగారెడ్డిలో 7.2, సంగారెడ్డిలో 7.3, సిద్దిపేటలో 8.2, ఆదిలాబాద్లో 8.5, మేడ్చల్ మల్కాజ్గిరి, నిర్మల్లో 8.6, మెదక్లో 8.7, వికారాబాద్లో 8.9, కామారెడ్డి, సిరిసిల్లలో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మెదక్, హన్మకొండలో సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, నల్లగొండ, రామగుండంలో, అదిలాబాద్ కనిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర తక్కువగా, ఇతర ప్రాంతాల్లో 2 డిగ్రీల మేర తక్కువగా నమోదై నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. పడిపోతున్న ఉష్ణోగ్రతలతో వృద్ధులు, చిన్నపిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. కొందరు న్యూమోనియా, ఇతర శ్వాససంబంధిత జబ్బులబారిన పడుతున్నారు. కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి.
వచ్చే రెండు రోజుల్లో కూడా తెలంగాణ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రి పూట బయటకు తిరుగొద్దని చెబుతున్నారు. అత్యవసర పని ఉంటే చెవులు కవర్ అయ్యే విధంగా క్యాప్ పెట్టుకోవాలని.. అలాగే స్వెట్టర్ ధరించాలని సూచిస్తున్నారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications