ఎనుమాముల మార్కెట్ లో మిర్చి రైతుల కన్నెర్ర.. అసలేం జరుగుతుందంటే!!
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చి రైతులు కన్నెర్ర చేశారు. తమకు గిట్టుబాటు ధర రావటం లేదని రోడ్డెక్కారు. వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట మిర్చి రైతులు ధర్నాకు దిగారు. వ్యాపారస్తులు అంతా కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ మిర్చి రైతులు వ్యవసాయ మార్కెట్ గేటు ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు.
ఆరుగాలం శ్రమించి పంట పండించినా అన్నదాతల కష్టాలు తీరటం లేదు. ఈ దఫా కూడా మిర్చి రైతులకు అకాల వర్షాలు, అధిక వర్షాలు, తెగుళ్లు పెద్దగా ఆశించిన దిగుబడులను ఇవ్వలేదు. అయినప్పటికీ కష్టపడి పండించిన పంటను మార్కెట్ కు తీసుకువస్తే మార్కెట్లో వ్యాపారస్తులు అందరూ కుమ్మక్కై కనీసం మద్దతు ధర కూడా చెల్లించకుండా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .

తేజ రకం మిర్చి క్వింటాలకు 21,000 రూపాయలు మార్కెట్లో పలుకుతుంటే, తమ వద్ద కేవలం 13 వేల రూపాయలకే కొనుగోలు చేయడానికి అడుగుతున్నారని, రూ.25 వేల వండర్ హాట్ రకం మిర్చిని రూ.15 వేలకు కొనుగోలుచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో వ్యాపారస్తులు అంతా సిండికేట్ అయి తమకు నష్టం చేస్తున్నారని మిర్చి రైతులు మండిపడుతున్నారు.
తమకు జరుగుతున్న అన్యాయాన్ని మార్కెట్ అధికారులు పట్టించుకోవడంలేదని మార్కెట్ ప్రధాన గేటు ముందు రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో కొద్దిసేపు మార్కెట్ దగ్గర వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని, రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి మిర్చిని కొనుగోలు చేసేలాగా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఎనుమాముల మార్కెట్ లో మిర్చి రైతు కన్నెర్ర. వ్యాపారులు మోసం చేస్తున్నారని ఆందోళన..!#Enumamula #Telangana #Mirchi #MichiPrices #MirchiFarmers #Oneindiatelugu pic.twitter.com/koFdTXCRmA
— oneindiatelugu (@oneindiatelugu) January 8, 2024
అప్పులు తెచ్చి పంట పండించిన తాము ఇలాగైతే అప్పుల ఊబి నుండి ఎలా బయటపడతామని వారు ఆవేదన చెందుతున్నారు. రైతుల ఆందోళనల నేపధ్యంలో మార్కెట్ కార్యాలయ అధికారుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా మద్దతు ధరలు ఇవ్వాలని, లేదంటే మిర్చి రైతుల ఆందోళనల సెగ తగలక తప్పదని రైతులు హెచ్చరిస్తున్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications