ఆ ఫోటోతో హైదరాబాద్ కు సంబంధం లేదు.. అది పాకిస్తాన్ లో : కేటీఆర్
హైదరాబాద్ : మెట్రో పిల్లర్ ఒకటి విరగిపోయే స్థితిలో ఉందని.. దానికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. అదంతా వట్టి పుకారేనని తేల్చేశారు.
సోషల్ మీడియాలో కనిపిస్తోన్న ఆ ఫోటోతో మెట్రో రైలు ప్రాజెక్దుకు గానీ పీవీ ఎక్స్ ప్రెస్ హైవేకు గానీ సంబంధం లేదని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు కేటీఆర్. ట్విట్టర్ లో ఆ ఫోటోను షేర్ చేసిన కేటీఆర్.. ఆ ఫోటో పాకిస్తాన్ లోని రావల్పిండికి చెందిన నిర్మాణంగా వెల్లడించారు.
This is not in Hyderabad neither in Metro nor in PVNR. Actually it's in Rawalpindi, Pakistanhttps://t.co/q8wilsOq0T https://t.co/WKGrXmn8rf
— KTR (@KTRTRS) August 3, 2016
ఇలాంటి వదంతులను నమ్మవద్దని.. హైదరాబాదీ ప్రజలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపారు కేటీఆర్. నగర సమస్యలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన కేటీఆర్.. సోషల్ మీడియా ద్వారా తన ద్రుష్టికి వచ్చే ప్రతీ సమస్యపై స్పందించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మెట్రో పిల్లర్ విరిగిపోయిన వదంతులపై ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు కేటీఆర్.