చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది.!మంత్రి తలసాని ఉద్ఘాటన.!

హైదరాబాద్ : రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమ హితాన్ని కాంక్షిచారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎల్లవేళలా అండగా ఉంటుందని ప్రకటించారు. శనివారం తెలుగు పిల్మ్ ఇండస్ట్రీ ప్రతినిధులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం షూటింగ్ లు నిలిచిపోయి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులకు అవసరమైన నిత్యావసర వస్తువులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ అందజేసిన విషయాన్ని ఈ సందర్బంగా ఇండస్ట్రీ ప్రతినిధులు గుర్తుచేసుకున్నారు. క్లిష్ట పరిస్థితులలో ఉన్న తమకు అండగా నిలిచి ఆదుకున్న శ్రీనివాస యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

The government has always been supportive for the film industry!Minister Talasani emphasized.!

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం లాక్‌డౌన్ ను అమలు చేస్తుందని, అందరు దీనికి సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించడం శానిటైజర్ ను వినియోగించడం వంటి నిబంధనలు పాటిస్తూ కరోనా భారిన పడకుండా రక్షించుకోవాలని సూచించారు. రెండో దశలో లాక్‌డౌన్ అమలులో ఉన్న కారణంగా సినీ పరిశ్రమలోని కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, అలాంటి వారందరిని ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నరు తలసాని.

అదేవిధంగా ప్రతి ఒక్క కార్మికుడికి కరోనా వ్యాక్సిన్ అందేలా ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుకు కార్యచరణ రూపొందింస్తున్నామని తెలిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో తెలుగు పిల్మ్ ఇండస్ట్రీ అధ్యక్షులు అనిల్ కుమార్, సీఎస్ఎన్, దొర, చిత్రపురి కాలనీ సెక్రెటరీ కాదంబరి కిరణ్ తదితరులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+