షాక్: లలితా జ్యూయల్లరీలో వారంలో రెండో చోరి, ఎందుకిలా?
హైదరాబాద్:హైద్రాబాద్ లలితా జ్యూయల్లరీ దుకాణంలో శుక్రవారం నాడు మరో దొంగతనం చోటు చేసుకొంది.సోమాజిగూడలోని తమ షోరూమ్లో చోరీ జరిగినట్టు లలితా జ్యువెల్లర్స్ ప్రతినిధి జి. మధుసూదన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు దొంగతనం చోటు చేసుకోవడం గమనార్హం.
టీవీలో లలిత జ్యూయలరీ అడ్వర్టైమ్ మెంట్ చాల ఫేమస్ అయింది. ఈ అడ్వర్టైమ్ మెంట్లో చెప్పినట్టుగానే దొంగలు కూడ తెలివిగా వ్యవహరిస్తున్నారు. యాడ్లో చూపినట్టుగా ఆరు రోజుల క్రితం దొంగతనానికి పాల్పడ్డారు.
ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన షోరూమ్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో వైపు శుక్రవారం నాడు కూడ మరో దొంగతనం చోటు చేసుకొంది. ఓ ఓంట ఈ దొంగతనం చేసినట్టు షోరూమ్ నిర్వాహకులు గుర్తించారు.

వారంలో రెండో రోజు లలిత జ్యూయల్లరీలో చోరీ
వారం రోజుల వ్యవధిలో లలిత జ్యూయల్లరీ దుకాణంలో రెండో చోరీ చోటు చేసుకొంది. సోమాజిగూడలోని తమ షోరూమ్లో చోరీ జరిగినట్టు లలితా జ్యువెల్లర్స్ ప్రతినిధి జి. మధుసూదన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 11న తమ షోరూమ్కు ఓ జంట 66 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేసిందని ఫిర్యాదులో తెలిపారు. తమ సిబ్బందిని గందరగోళానికి గురిచేసి ఈ దొంగతనం చేశారని వెల్లడించారు.

సీసీటీవి పుటేజీ ఆధారంగా గుర్తింపు
ఈ నెల 12వ, తేదిన ఈ విషయాన్ని గుర్తించినట్టు ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పారు. తర్వాత రోజు ఈ విషయం బయటపడటంతో సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించామన్నారు. చోరీకి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని పోలీసులకు అందజేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆరు రోజుల క్రితమే యాడ్ తరహలోనే
ఆరు రోజుల క్రితం లలిత అడ్వర్టైజ్మెంట్ తరహలో చోరీ జరిగింది. బురఖాలు ధరించిన ఇద్దరు మహిళలు టీవీలో చూపినట్టుగానే లలిత జ్యూయల్లరీ దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డారు.ఈ నెల 9న లలితా జ్యువెల్లర్స్ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు నగ స్థానంలో నకిలీ హారాన్ని పెట్టి ఇద్దరు మహిళలు ఈ చోరీ చేసినట్టు సీసీ కెమెరా దృశ్యాలు ఆధారంగా గుర్తించారు.

వరుస దొంగతనాలు
ఒకే దుకాణాన్ని లక్ష్యంగా చేసుకొని ఎందుకు దొంగతనాలు చోటు చేసుకొంటున్నాయనే విషయమై చర్చ సాగుతోంది. ఆరు రోజుల క్రితమే దొంగతనం చోటు చేసుకొంది. అయితే ఈ దొంగతనానికి సంబంధించిన దర్యాప్తు సాగుతున్న తరుణంలోనే మరో దొంగతనం చోటు చేసుకోవడం చర్చనీయాశంగా మారింది.లలిత జ్యువెలర్స్ ఎండీ కిరణ్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు టీవీల్లో ఇచ్చిన ప్రకటనలోలాగానే కొందరు దొంగతనాలకు సైతం పాల్పడుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications