ప్రియుడి కోసం భర్తను, కూతుర్ని చంపిన ఈమె క్రిమినల్ మైండ్ క్రైం సినిమాల్లోనూ ఉండదు!
ప్రియుడి మోజులో పడి భర్తను, కన్నబిడ్డను హతమార్చింది ఓ ఇల్లాలు. మూడు నెలల వ్యవధిలో భర్తను, కన్న బిడ్డను హతమార్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితల గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడించారు.
అటవీ ప్రాంతంలో యువతి మృతదేహం
ఆగస్టు 28వ తేదీన కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి పక్కన అటవీ ప్రాంతంలో యువతి మృతదేహం పడి ఉన్నట్టు పోలీసులకు సమాచారం రాగా సంఘటన స్థలానికి వెళ్ళిన పోలీసులు ఆ మృతదేహం చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన కప్పుల వర్షిణి గా గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

విచారణలో విస్తుబోయే విషయాలు
ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఆమె తల్లి కవిత పైన అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా కేసులో దర్యాప్తు జరిపారు. ఈనెల రెండవ తేదీన తల్లి కవిత, ఆమె ప్రియుడు రాజ్ కుమార్ పోలీసులకు పట్టుబడ్డారు. ఇక విచారణలో వీరు చెప్పిన విషయాలు విని పోలీసులు విస్తుపోయారు.
పక్షవాతంతో మంచంలో భర్త.. ప్రియుడి మోజులో భార్య
కుమారస్వామి మొదటి భార్య చనిపోవడంతో మల్హర్ మండలం కొయ్యూరు కు చెందిన కవితను 24 ఏళ్ల క్రితం రెండవ పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె ఇటీవల ప్రేమ వివాహం చేసుకోగా, పెద్ద కుమార్తె ఇంట్లోనే ఉంటుంది. కుమారస్వామి గత ఐదేళ్లుగా పక్షవాతంతో మంచం లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో కవిత అదే గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అనే యువకుడి మోజులో పడింది.
గొంతు నులిమి భర్త హత్య, కూతురిని చంపాలని నిర్ణయం
ఇక ఈ విషయం ఇంట్లో తెలిసి ఇంట్లో తరచూ గొడవలు అవుతున్నాయి. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించి తన ప్రియుడితో కలిసి జూన్ 25వ తేదీన పడుకుని ఉన్న కుమారస్వామిని గొంతు నులిమి హత్య చేశారు. ఆపై అతను అనారోగ్యంతో చనిపోయాడని చిత్రీకరించారు ఇక తల్లి తండ్రిని హత్య చేసిన విషయం కుమార్తె వర్షిణికి తెలియడంతో ఆమెని కూడా హత్య చేయాలని నిర్ణయించుకున్నారు
కుమార్తె వర్షిణిని చంపేసిన తల్లి, ఆమె ప్రియుడు
. ఆగస్టు 3వ తేదీ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వర్షిణిని కవిత ఆమె ప్రియుడు రాజ్ కుమార్ ఊపిరి ఆడకుండా చేసి హతమార్చారు. ఆపై మృతదేహాన్ని సంచిలో వేసి ఇంటి వెనకాల చెట్ల పొదల్లో దాచిపెట్టారు. ఆ తర్వాత గ్రామ శివారులోని పొదల్లో పడేశారు. ఇక మృతదేహం దుర్వాసన వస్తున్న క్రమంలో 25వ తేదీ కాటారం వైపుకు తీసుకెళ్ళి అడవిలో పడేసి వెళ్లారు.
క్షుద్ర పూజలు చేసినట్టు చిత్రీకరణ
పోలీసుల దృష్టి మరల్చడం కోసం అక్కడేదో క్షుద్ర పూజలు చేస్తున్నట్టు ఆడవాళ్లు వదిలి వెళ్లారు. తల్లి పై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా జంట హత్యల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రియుడు కోసం భర్తను, కన్నబిడ్డను దారుణంగా హతమార్చింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications