హైద్రాబాద్పై ఐసిస్: 'వీరి వెనుక ఎవరో తెలియాలి', కిచెన్లో బాంబులు దాచారు
హైదరాబాద్: పాతబస్తీలో పట్టుబడిన ఐసిస్ సానుభూతిపరులను తమ కస్టడీకి ఇవ్వాలని జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం నాడు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వీరి వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని, అందుకోసం 12 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది.
ఎన్ఐఏ, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించి ఐదుగురు ఐసిస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిని గురువారమే కోర్టు ఎదుట హాజరుపరిచారు. కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేసి, ఈ రోజు వాదనలు వినిపించారు.

వీరి వెనుక ఎవరన్నారో తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు. అలాగే, డబ్బులు, పేలుడు పదార్థాలు వీరికి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారో తెలుసుకోవాల్సి ఉందని, అందుకు తమ కస్టడీకి అప్పగించాలని కోర్టుకు విన్నవించారు.
వారి నుంచి మరింత సమాచారం సేకరించవలసి ఉందని చెప్పారు. వీరి నుంచి భారత్కు ముప్పు ఉందని చెప్పారు. దానికి, నిందితుల తరఫు లాయర్లు మాట్లాడుతూ.. రెండు రోజుల కస్టడీ చాలని కోర్టుకు విన్నవించారు.
కిచెన్లో పేలుడు పదార్థాలు
పట్టుబడిన ఐసిస్ సానుభూతిపరులు పేలుడు పదార్థాలను తమ తమ ఇళ్లలోని కిచెన్లో దాచి పెట్టినట్లుగా అధికారులు గుర్తించారు. వంట పాత్రలో కూడా పెట్టారు. యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్, అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను వారు వంట గదిలో పెట్టినట్లు ఎన్ఐఏ అధికారులు, తెలంగాణ పోలీసులు గుర్తించారు.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
హైదరాబాద్లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్న్యూస్ -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications