బైక్లపై నుంచి దూసుకెళ్తూ ఇసుక లారీ బీభత్సం: ముగ్గురు మృతి
హైదరాబాద్: హైదరాబాదులోని వనస్థలిపురం సుష్మా థియేటర్ చౌరస్తాలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. సిగ్నల్ దాటి వాహనాలు వెళ్తున్న సమయంలో ఇసుక లారీ బైక్లపై నుంచి దూసుకెళ్లి ముగ్గురిని ప్రాణాలను బలి తీసుకుంది.
ఓ వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో బైక్పై వెళ్తుండగా ఆటోనగర్ నుంచి దూసుకెచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. అదే వేగంతో మరో బైక్పై నుంచి దూసుకెళ్లింది. క్షణాల్లో రోడ్డుపై నెత్తురు పారింది. శరీర భాగాలు ఛిద్రమై బాధితులు హాాకారాలు చేశారు.
Recommended Video


జనాలు తలో దిక్కు పరుగు...
లారీ తమపైకి దూసుకుస్తుందనే భయంతో ప్రజలు తలో దిక్కు పరుగులు తీశారు. లారీ ప్రమాదలో ఓ చిన్నారి సహా ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

వారు ఇలా వస్తుంండగా.
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పర్కాల గ్రామానికి చెందిన శ్రీరామోజు సునీల్ (30), రాధ దంపతులు తమ కుమారులు మహేష్ (7), మనీష్ (4)లతో కలిసి మీర్పేటలో ఉంటున్నారు. సునీల్ ఓ బంగారం దుకాణంలో పనిచేస్తున్నాడు. సంక్రాంతి పండుగకు వారంతా లిసి బైక్పై నల్లగొండ జిల్లా శ్రీనాథపురంలోని సునీల్ అత్తారంటికి వెళ్లారు.. తిరిగి వస్తుండగా బుధవారం ఈ ప్రమాదం జరిగింది. సునీల్ కుమారుడు మహేష్ అక్కడికక్కడే మరణించాడు

మరో వ్యక్తి బైక్ మీదికి...
సునీల్ కుటుంబం ప్రయాణిస్తున్న బైక్ను ఢీకొట్టిన ఇసుక లారీ మరో బైక్పైకి దూసుకెళ్లింది దీంతో ఆ బైక్పై ఉన్న నరేష్ (20) యువకుడు మరణించాడు. ఇతను కొత్తపేటలోని బట్టలు దుకాణంలో పనిచేస్తున్నాడు. సునీల్కు, అతని చిన్నకుమారుడు మనీష్ స్వల్పంగా గాయపడ్డారు. లీ బీభత్సానికి రెండు బైక్లు సహా నాలుగు ఆటోలు ధ్వంసమయ్యాయి.

డ్రైవర్ తాగి ఉన్నాడని..
ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. లారీకి బ్రేకులు ఫెయిలయ్యాయని కొందరు అంటుండగా డ్రైవర్ తాగి ఉన్నాడని మరికొందరు చెబుతున్నారు. బైక్పై వెళ్లవద్దని బంధువులు వారించినా సునీల్ వినలేదు. బస్సులో వెళ్తే ప్రమాదం తప్పేదని అంటున్నారు.
-
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications