వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిర్పూర్ పేపర్ మిల్లులో ప్రమాదం.. ముగ్గురు కూలీల మృతి..
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ పేపర్ మిల్లులో ఘోర ప్రమాదం జరిగింది. బాయిలర్ నిర్మాణ పనుల్లో భాగంగా పిల్లర్లు తవ్వుతున్న ప్రాంతంలో ఒక్కసారిగా మట్టిపెళ్లలు కూలీలపై విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మంచిర్యాల,కరీంనగర్ ఆస్పత్రులకు తరలించారు. ఘటనలో పేపర్ మిల్లు కార్మికులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. మట్టిపెళ్లలు మీద పడటంతో కూలీలు అక్కడే చిక్కుకుపోయారు.. దీంతో రెస్క్యూ టీమ్ వారిని బయటకు తీసింది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
English summary
A deadly accident at a Sirpur paper mill in Asifabad district while boiler construction, the mudslides were broken, Three laborers died on the spot.
Story first published: Sunday, February 23, 2020, 7:42 [IST]