2019లో మా పార్టీయే 'కింగ్'.. ఎన్నికల్లో ఒంటరి పోరే!: కోదండరామ్
హైదరాబాద్: 2019ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగుతామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ తెలిపారు. రాష్ట్రంలోని 119 స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీజేఎస్ పాత్ర 'కింగ్ మేకర్'కి పరిమితమవదని.. 'కింగ్'గా అవతరిస్తుందని చెప్పారు.
తెలంగాణలో ప్రజలు 'హంగ్' తీర్పునిచ్చే అవకాశం ఉండదని, తమ పార్టీకే సంపూర్ణ మెజారిటీ కట్టబెడుతారని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని తమ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోదండరామ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటకలో ప్రజల ఆకాంక్షలను జాతీయ పార్టీలు తీర్చలేకపోయినందువల్లే.. అక్కడ 'హంగ్' ఏర్పడిందని చెప్పారు. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వినియోగదారులపై గుదిబండలా మారాయన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోదండరాం డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీజేఎస్ తరుపున పోటీ చేసేందుకు 1000మంది ఔత్సాహికులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఈ నెల 27న వారందరికీ అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications