2019లో మా పార్టీయే 'కింగ్'.. ఎన్నికల్లో ఒంటరి పోరే!: కోదండరామ్
హైదరాబాద్: 2019ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగుతామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ తెలిపారు. రాష్ట్రంలోని 119 స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీజేఎస్ పాత్ర 'కింగ్ మేకర్'కి పరిమితమవదని.. 'కింగ్'గా అవతరిస్తుందని చెప్పారు.
తెలంగాణలో ప్రజలు 'హంగ్' తీర్పునిచ్చే అవకాశం ఉండదని, తమ పార్టీకే సంపూర్ణ మెజారిటీ కట్టబెడుతారని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని తమ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోదండరామ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటకలో ప్రజల ఆకాంక్షలను జాతీయ పార్టీలు తీర్చలేకపోయినందువల్లే.. అక్కడ 'హంగ్' ఏర్పడిందని చెప్పారు. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వినియోగదారులపై గుదిబండలా మారాయన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోదండరాం డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీజేఎస్ తరుపున పోటీ చేసేందుకు 1000మంది ఔత్సాహికులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఈ నెల 27న వారందరికీ అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications