రేపు హైదరాబాద్కు జగన్ .. ముఖ్యమంత్రి హోదాలో తొలి పర్యటన
హైదరాబాద్ : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం హైదరాబాద్ రానున్నారు. ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్ తొలిసారి హైదరాబాద్ వస్తున్నారు. తమ అధినేత ఫస్ట్ టైం భాగ్యనగరానికి రానుండటంతో ఆ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఫస్ట్ టైం ...
జగన్ అనే నేను అని గురువారం విజయవాడలో ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే చీఫ్ స్టాలిన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏపీలో పరిపాలనపై పట్టు సాధిస్తూనే తెలంగాణ పర్యటటిస్తున్నారు. ఏపీలో అఖండ విజయం సాధించి .. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ తొలిసారి హైదరాబాద్ వసున్నారు. దీంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేశారు. భారీ ఫ్లెక్సీలు నగరంలో వెలిశాయి. కార్యకర్తలు, అభిమానులు, జగన్, వైఎస్ఆర్ అభిమానులు శంషాబాద్ నుంచి ర్యాలీగా వచ్చే అవకాశం ఉంది. ఏపీ సీఎంగా తొలిసారి అధికారికంగా పర్యటించనుండటంతో .. తమ నేతకు మరచిపోని వెల్ కం ఇచ్చేందుకు ఆ పార్టీ నేతలు సంసిద్ధంగా ఉన్నారు.
ఇఫ్తార్ విందు
ఈ నెల 5న ముస్లింల పవిత్ర పండుగ రంజాన్. ఈ నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్ లో శనివారం ఇప్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్కు ఆహ్వానం అందింది. దాంతో జగన్ హైదరాబాద్ వస్తున్నారు. గవర్నర్ ఇఫ్తార్ విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు, ముఖ్య నేతలు హాజరవుతారు. ఇటు ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ కలువడంతో ఇప్తార్ విందుకే కళరానుంది. గతంలో చంద్రబాబు, కేసీఆర్ కలిసిన పెద్దగా ప్రాధాన్యం లేదు. వారు మధ్య మాటలు లేకపోవడంతో ఎడమొహం పెడమొహంగా ఉన్నారు.

ఇటు ఇరురాష్ట్రాల మంత్రులు కూడా హాజరైన దాఖలాలు తక్కువే. ఈ క్రమంలో జగన్, కేసీఆర్ కలయికతో గవర్నర్ ఇఫ్తార్ విందుకు ప్రాధాన్యత ఏర్పడింది. దీంతోపాటు జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరై ప్రసంగించిన కేసీఆర్ .. ఏపీ తమ పొరుగు రాష్ట్రానికి సఖ్యతతో మెలుగుదామని చెప్పిన సంగతి తెలిసిందే. నీటి వాటా సహా తదితరాల కోసం అన్నదమ్ముల్లా పంచుకుందామని .. కలిసి పోరాడి, కేంద్రం నుంచి నిధులు తీసుకొందామని సెలవిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని కేసీఆర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో జగన్, కేసీఆర్ సామరస్యంగా తమ నిధుల కోసం కేంద్రంపై ఉద్యమించే అవకాశం కనిపిస్తోంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications