టిఆర్ఎస్ సభ్యులే దాడికి పాల్పడ్డారు: ఉత్తమ్
హైదరాబాద్:అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా అధికార పార్టీ సభ్యులే దాడికి పాల్పడ్డారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. నిరసన వ్యక్తం చేసే హక్కుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
Recommended Video

అసెంబ్లీలో కోమటిరెడ్డి వీరంగం, మండలి ఛైర్మన్ కంటికి గాయం
అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత పీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడారు. మార్షల్స్ సహయంతో అధికార పార్టీ మమ్మల్ని అసెంబ్లీ లోపల తొక్కిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

నిరసన వ్యక్తం చేశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రానున్న రోజుల్లో తెలంగాణ అసెంబ్లీలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన దగా, మోసాన్ని వివరించనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
ప్రజలను మోసం చేయడంలో టిఆర్ఎస్ దిట్ట
ప్రజలను మభ్య పెట్టే మాటలను చెప్పడంలో టిఆర్ఎస్ దిట్ట అని మాజీ మంత్రి డికె అరుణ చెప్పారు. అబద్దాలను చెప్పడంలో టిఆర్ఎస్ నేతలు ముందుంటారని డికె అరుణ చెప్పారు.












Click it and Unblock the Notifications