విషాదం .. మహబూబాబాద్ లో ఆటో ట్రాలీ బోల్తాపడి 36 మందికి తీవ్ర గాయాలు
మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది . ఆటో ట్రాలీ టైర్ పేలటంతో జరిగిన ప్రమాదంలో ట్రాలీలో ఉన్న 36 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు . ప్రస్తుతం వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు.
క్షతగాత్రులు చెప్పిన వివరాలను బట్టి చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన 36 మంది గిరిజనులు తిరుపతి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ వరకు ఒక ఆటో ట్రాలీని మాట్లాడుకుని 36 మంది ఆటో ట్రాలీలో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ కు బయలుదేరారు. నామాలపాడు అటవీప్రాంతానికి రాగానే ఆటో ట్రాలీ టైర్ పేలిపోయింది . వేగంగా వాహనం నడుపుతున్న సమయంలో టైర్ పగలటంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.

దీంతో ఆటో ట్రాలీలో ప్రయాణం చేస్తున్న 36 మందికి తీవ్ర గాయాలుయ్యాయి. చాలా మంది తలకు తీవ్ర గాయమైంది . ఈ ఘటనలో ఒక చిన్నారి ఎడమచెయ్యి విరిగిపోయింది . ప్రస్తుతం వీరంతా మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications