ఓటేసిన ట్రాన్స్ జెండర్లు.. మీరు ఓటెయ్యలేరా అంటూ సూటిప్రశ్న!!
ఎన్నికల పండుగలో ట్రాన్స్ జెండర్ లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సమాజంలో వివక్షకు గురవుతూ భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చాలా మంది ట్రాన్స్ జెండర్ లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకు మేము సైతం అంటున్నారు. వరంగల్ నగరంలో ఉన్న 338 మంది ట్రాన్స్ జెండర్లు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు వరంగల్లో ఉన్న ట్రాన్స్ టెండర్లు చెబుతున్నారు. సమాజంలో ఎలాంటి గుర్తింపు లేని తామే ఓటు యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఓటు హక్కును వినియోగించుకున్నామని, బద్దకించి టీవీలు చూస్తూ ఇంట్లో కూర్చోకుండా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ట్రాన్స్ టెండర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.

రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో అన్ని వర్గాల వారికి ఏవో హామీలు ఇస్తారని, మేనిఫెస్టో లోను అనేక అంశాలను పెడతారని, వివిధ వర్గాల సంక్షేమం కోసం ఎంతో చేస్తున్న రాజకీయ నాయకులు, ట్రాన్స్ టెండర్ల సంక్షేమాన్ని మరిచిపోతున్నారని ట్రాన్స్ టెండర్లు పేర్కొన్నారు. అయినప్పటికీ ఓటు వేయడం తమ బాధ్యతగా భావించి ఓటు హక్కును వినియోగించుకున్నామని, భారతదేశ పౌరులుగా ఓటేయటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ట్రాన్స్ జెండర్ లు చెబుతున్నారు.
మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి అత్యంత శక్తివంతమైన వజ్రాయుధం వంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ట్రాన్స్ జెండర్ లు కోరుతున్నారు. ఓటు వేయాల్సిన ఆవశ్యకతపై ట్రాన్స్ జెండర్ ల రాష్ట్ర అధ్యక్షురాలు లైలా మాట్లాడుతూ ఓటు వేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అని గుర్తు చేశారు.
ఓటేసిన ట్రాన్స్ జెండర్లు.. ఓటు మీరెయ్యలేరా అంటూ ప్రశ్న..!!#TelanganaElections2023 #TelanganaElection2023 #TelanganaAssemblyElections2023 #TSAssemblyElections2023 #Oneindiatelugu pic.twitter.com/IXur7EF5lz
— oneindiatelugu (@oneindiatelugu) November 30, 2023
చదువుకున్న చాలామంది కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం లేదని, ఇది మన రాజ్యాంగ వ్యవస్థకు చేటు చేస్తుందని ట్రాన్స్ టెండర్ లైలా తెలిపారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తామంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నామని పేర్కొన్న లైలా, డబ్బుకు , మద్యానికి ప్రలోభ పడకుండా అందరూ ఇళ్ల నుండి బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఏ రాజకీయ పార్టీలు గుర్తించకపోయినా, తమ సంక్షేమానికి ఎవరు ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా తామంతా సమిష్టిగా ఓటు వేశామని, మరి మీరు ఓటు వేశారా అని ప్రశ్నిస్తున్నారు. మేమే ఓటేయగా లేనిది.. మీరు ఎందుకు ఓట్ వేయలేరు అంటూ ఓటింగ్ పై ఆసక్తి చూపించని ఓటర్లను ట్రాన్స్ జెండర్ లు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
-
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం











Click it and Unblock the Notifications