ఆంధ్ర బస్సులకు హెచ్చరిక: దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై తెరాస ఎమ్మెల్యే
దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 11 మంది మరణించిన నేపథ్యంలో తెరాస ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్ ఆంధ్ర బస్సులపై కత్తులు నూరుతున్నారు.
హైదరాబాద్: ఇరు రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్, సింగిల్ పర్మిట్లను అనుమతించకుంటే 15 రోజుల్లో ఆంధ్ర సరిహద్దుల్లో గల కోదాడ వద్ద ఆంధ్రా బస్సులు, లారీలను ఆర్టీసీ కార్మికులతో కలిసి అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు ఎపి ప్రభుత్వాన్ని శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు.
బుధవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో అక్రమంగా బస్సులు, లారీలను తిప్పినట్లుగా ఇప్పుడు కూడా ఆంధ్రా బస్సులు తిరుగతున్నాయని ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రంలో ఆర్టీసీకి రూ.1000 నుంచి రూ.1200 కోట్ల నష్టం వస్తున్నదని ఆయన చెప్పారు.

సింగిల్ పర్మిట్లు అంగీకరించకపోవడం వల్ల తెలంగాణలోని 1.40 లక్షల లారీ యజమానులకు నష్టం కలుగుతుందన్నారు. కృష్ణా జిల్లాలోని నందిగామ వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై 10 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
సమావేశంలో టీఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్రెడ్డి, టీఎంఎస్ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications