వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవ్వులు పూయించారు: లోకసభలో తెలంగాణ ఎంపీ, కేంద్రమంత్రి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన ఓ పార్లమెంటుసభ్యుడికి, కేంద్రమంత్రికి జరిగిన సంభాషన గురువారం జరిగిన లోకసభలో నవ్వులు పూయించాయి. ఆ వివరాల్లోకి వెళితే.. లోక్‌స‌భ‌లో ఇవాళ ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో న‌వ్వులు పూశాయి. దేశంలో నెల‌కొన్న నీటి స‌మ‌స్యపై వేసిన ప్ర‌శ్న‌కు కేంద్ర మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ స‌మాధానం ఇచ్చారు.

ఆ స‌మ‌యంలో తెలంగాణ ఎంపీ ఒక‌రు మిష‌న్ భ‌గీర‌థ‌కు అద‌న‌పు నిధులు ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరారు. ఆ ఎంపీ మాట్లాడుతున్న స‌మ‌యంలో కేంద్ర మంత్రి కొంత అస్వ‌స్థ‌తగా క‌నిపించారు.

TRS MP Jithendra Reddy Seeks More Funds For Mission Bhagiratha

దీంతో 'మంత్రి గారు ఇవాళ చాలా డ‌ల్‌గా ఉన్నారు' అంటూ ఆ ఎంపీ ఛమత్కారంగా అన్నారు. ఆ ఎంపీ చేసిన వ్యాక్యలకు మంత్రి వెంట‌నే స్పందించారు. ఎవ‌రైనా డ‌బ్బులు అడిగితే, తాను డ‌ల్‌గా మారుతాన‌ని మంత్రి స‌మాధానం ఇచ్చారు. దీంతో స‌భ‌లో న‌వ్వులు చిగురించాయి.

ఆ తర్వాత మిషన్ భాగీరతకు కావాల్సిన అదనపు నిధుల విషయంలో కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తుందని తెలిపారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిసన్ భాగీరథ పథకాన్ని ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.

English summary
TRS MP Jithendra Reddy has requested the Union Drinking Water Minister To Grant More Funds For Telangana Government's Mission Bhagiratha Scheme, Which will be Inaugurated by PM MOdi on August 7th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X