తెలంగాణను నెంబర్ 1 చేసింది అందులోనే: బీఆర్ఎస్ సర్కారుపై ప్రియాంక గాంధీ విమర్శలు
వరంగల్: ప్రజలకు మేలు చేయని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చే సమయం ఆన్నమైందని.. ఆ అవకాశం ఇప్పుడు వచ్చిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ. ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ ఒకే కుటుంబం చేతిలో బందీ అయ్యిందని ఆరోపించారు. శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ విజయభేరీ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్రం ప్రజల త్యాగాల వల్ల ఏర్పడిందన్నారు ప్రియాంక గాంధీ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ అమరులు ఆకాంక్షలు నెరవేరాయా? అని ప్రశ్నించారు. యువత సాధించుకున్న ఈ తెలంగాణలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయని నిలదీశారు. నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని అన్నారు. ఉద్యోగ పరీక్షల్లో కుంభకోణాలు జరిగాయని, పేపర్లు లీక్ కావడంతో యువత నిరాశకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారన్నారు.

ఒక యువతి ఆత్మహత్య చేసుకుంటే.. ఆమె చావు గురించి ఈ ప్రభుత్వం వ్యంగ్యంగా మాట్లాడిందని ప్రియాంక మండిపడ్డారు. అసలు ఆ యువతి దరఖాస్తు చేసుకోలేదని చెప్పారన్నారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే.. నిరుద్యోగుల కష్టాలు తొలగిపోతాయని ప్రియాంక చెప్పారు. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అమలు చేసి.. పేపర్ లీకేజీలను అరికాడతామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని ప్రతి మహిళ ఖాతాలో రూ. 2500 వేస్తామన్నారు ప్రియాంక గాంధీ. గ్యాస్ సిలిండర్ రూ. 500కే ఇస్తామని చెప్పారు. అంతేగాక, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. తెలంగాణలో యువశక్తి, నారీశక్తిని చూస్తే.. గర్వంగా ఉందన్నారు. పాలకుర్తిలో ఒక కుటుంబం ప్రజలకు ఎంతో సేవ చేస్తే.. మరో కుటుంబం ప్రజల భూములు లాక్కుందన్నారు.
VIDEO | "I am feeling very proud after coming here. Particularly after seeing that a young, energetic woman candidate is contesting the election here," says Congress leader @priyankagandhi addressing an election rally in Palakurthy in Telangana.#TelanganaElection2023… pic.twitter.com/whkgdUBQB0
— Press Trust of India (@PTI_News) November 24, 2023
పదేళ్లుగా అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అహంకారంతో విర్రవీగుతున్నాయని ప్రియాంక గాంధీ విమర్శించారు. ఈ ప్రభుత్వాల పాలనలో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి జోరుగా వీస్తోందన్నారు. తెలంగాణలో దొరల పాలనను కూల్చి ప్రజల పాలనను కాంగ్రెస్ తీసుకువస్తోందన్నారు ప్రియాంక గాంధీ.
మరోవైపు, హుస్నాబాద్ కాంగ్రెస్ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనతో ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ దత్తత తీసుకున్న ముల్కనూరులో అభివృద్ధి జరిగిందా? అని నిలదీశారు. నిరుద్యోగంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ పేద ప్రజలకు ఎలాంటి మేలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈసారి అవకాశం ఇవ్వాలని కోరారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications