TS RTC: రాఖీ పండుగ లక్కీ డ్రా విజేతలకు నగదు బహుమతి అందజేసిన టీఎస్ఆర్టీసీ..
సెప్టెంబర్ 8వ తేదీ శుక్రవారం ఎంజిబిఎస్ బస్టాండ్లో జరిగిన రక్షా బంధన్ లక్కీ డ్రా బహుమతి పంపిణీ కార్యక్రమంలో 33 మంది మహిళలు నగదు బహుమతులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఈ డ్రాను నిర్వహించింది. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ విజేతలకు బహుమతులను అందజేశారు.
"రక్షా బంధన్ లక్కీ డ్రా చొరవకు అద్భుతమైన స్పందన లభించింది. సుమారు 3 లక్షల మంది మహిళా ప్రయాణికులు పాల్గొన్నారు. బహుమతులు గెలుచుకున్న మహిళలు విభిన్న నేపథ్యాలు, జీవన రంగాలకు చెందినవారు. అయితే వీరంతా గత కొన్నేళ్లుగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు" అని సజ్జనార్ తెలిపారు. ఆన్లైన్లో ముందస్తుగా టిక్కెట్లు బుక్ చేసుకునే వారి కోసం ప్రతి సంవత్సరం దసరా, సంక్రాంతి, ఉగాది పండుగల సందర్భంగా ఇలాంటి లక్కీ డ్రా ఈవెంట్లను నిర్వహించాలని కార్పొరేషన్ నిర్ణయించింది.

రక్షా బంధన్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 30, 31 తేదీల్లో మహిళా ఆర్టీసీ ప్రయాణికులకు లక్కీ డ్రా నిర్వహించారు. మొదటి బహుమతికి రూ.25వేలు, రెండో బహుమతికి రూ.15వేలు, తృతీయ బహుమతికి రూ.10వేలు నగదు పురస్కారం అందజేశారు. కాగా ఈ సారి రాఖీ పండుగకు ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది.ఆగస్టు 31న రూ. 22.65 కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్టైమ్ రికార్డుగా ఉంది. గతేడాది రాఖీ పండుగ రోజున రూ. 21.66 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సారి రూ. కోటి వరకు అదనంగా ఆదాయం వచ్చింది.
ఆగస్టు 30న తెలంగాణ వ్యాప్తంగా 9 వేల బస్సులు నడపగా.. రూ.18.25 కోట్ల ఆదాయం వచ్చింది. రాఖీ పండుగ రోజు 40.91 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. గతేడాదితో పోల్చితే అదనంగా లక్ష మంది రాకపోకలు సాగించారు. ఆక్యుపెన్సీ రేషియో విషయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా గతేడాది రికార్డును అధిగమించింది. గతేడాది రాఖీ పండుగ నాడు 101.01 ఆక్యుపెన్సీ సాధించగా, ఈ ఏడాది 104.68 శాతం నమోదు చేసింది.
#TSRTC రాఖీ పౌర్ణమి లక్కీ డ్రా విజేతలకు నగదు పురస్కారాల ప్రదానోత్సవం #Hyderabad లోని ఎంజీబీఎస్ ప్రాంగణంలో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ (@SajjanarVC ) గారు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు శుభాభింనందనలు తెలియజేశారు. సంస్థ ఉన్నతాధికారులతో… pic.twitter.com/m2W4UoFEKc
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) September 8, 2023
వరంగల్ జిల్లాలో 97.05 శాతం, ఉమ్మడి కరీంనగర్, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లో 90 శాతానికి పైగా ఆక్యుపెన్సీ రేషియో నమోదైంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలకు రద్దీ ఎక్కువగా కనిపించింది. హైదరాబాద్ కరీంనగర్, హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ నల్గొండ, హైదరాబాద్ నిజామాబాద్ రూట్లలో రద్దీ ఎక్కువగా ఉంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications