కుటుంబ సభ్యుడిని కోల్పోయా: నందమూరి హరికృష్ణ మృతిపై టీఎస్సార్ దిగ్భ్రాంతి
హైదరాబాద్: నందమూరి హరికృష్ణ మృతి చెందడంతో తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధగా ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టీ సుబ్బరామి రెడ్డి గురువారం అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ మంత్రి, సినీ నటుడు నందమూరి హరికృష్ణ మరణ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని చెప్పారు. హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా ఉండగా పలుమార్లు కలిసేవాళ్ళమని చెప్పారు. స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తి అన్నారు.

తెలుగు భాష అంటే ఆయనకు ప్రాణమని తెలిపారు. తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధగా ఉందన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని చెప్పారు.
హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ విషాద సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్ళే శక్తి ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications