ఆగస్ట్ 15న పుట్టినవారికి టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్.. పంద్రాగస్ట్ వేడుకలపై సజ్జనార్ ఏమన్నారంటే!!
ఆజాదీ కా అమృత మహోత్సవ్ సందర్భంగా టీఎస్ఆర్టీసీ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.ఆగస్టు 15వ తేదీన పుట్టిన చిన్నారులందరికీ 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు సిటీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. అంతేకాదు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధులకు ఆగస్టు 15న ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ పేర్కొంది. ఇక 120 రూపాయల టీ 24 బస్ టికెట్ ను ఆగస్టు 15వ తేదీన డెబ్భై ఐదు రూపాయలకే విక్రయించనున్నట్లు టీఎస్ఆర్టీసీ పేర్కొంది.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 12 రోజుల పాటు ఆర్టీసీ వేడుకలు
ఇక ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగస్టు 15న భారతదేశానికి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ వేడుకలను 12 రోజుల పాటు ఘనంగా నిర్వహించనుందని తెలిపారు. ఆగస్టు 15 సందర్భంగా వేడుకలను నిర్వహిస్తామని పేర్కొన్న ఆయన స్వాతంత్య్రానికి పూర్వం నుండి టీఎస్ఆర్టీసీ పరిణామం, సాంస్కృతిక వారసత్వం మరియు గత 75 సంవత్సరాలలో సహకరించిన వారిని స్మరించుకోవడం వంటి వివిధ అంశాలపై వేడుకలను నిర్వహిస్తామని సజ్జనార్ అన్నారు.

స్వాతంత్రం రాకముందు నుండే ఉనికిలో ఆర్టీసీ
స్వాతంత్ర్యం రాకముందే టిఎస్ఆర్టిసి ఉనికిలో ఉన్నందున ఇది గర్వించదగిన క్షణమని, చిన్నపిల్లలు, విద్యార్థులు మరియు పెద్దలు ప్రతి ఒక్కరి రోజువారీ జీవితాలపై ప్రభావం చూపిన ఆర్టీసీ కి సుదీర్ఘ చరిత్ర మరియు వారసత్వం ఉందని ఆయన అన్నారు. ఈ వేడుకల్లో ఉద్యోగులు, సాధారణ ప్రజలు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఆగస్టు 9 నుండి ప్రణాళిక చేయబడిన మరో ప్రత్యేక కార్యక్రమం ఏమిటంటే, ప్రతి రోజు ఉదయం 11 గంటలకు అన్ని ఆర్టీసీ బస్టాండ్ లో జాతీయ గీతాన్ని ప్లే చేయనున్నారు. ఇది ప్రజలలో గర్వం మరియు దేశభక్తిని పెంపొందించడానికి ప్రణాళిక చేయబడిందని పేర్కొన్నారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవాలు క్రింద అనేక పథకాలు.. బంపర్ ఆఫర్లు ఇవే
ఇదే సమయంలో టీఎస్ఆర్టీసీ ప్రజల కోసం ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాలు' కింద అనేక పథకాలను రూపొందించింది. 75 ఏళ్ల వయస్సు ఉన్న వారందరూ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఉచిత ప్రయాణ సదుపాయాన్ని పొందవచ్చని సజ్జనార్ వెల్లడించారు. అయితే టీ-24 టిక్కెట్ను ఆగస్టు 15న జంట నగరాల్లో ప్రయాణించడానికి ప్రస్తుతం ఉన్న వ్యక్తికి రూ.120 నుండి రూ.75కి అందించబడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 15న పుట్టిన పిల్లలకు 12 ఏళ్లు వయసు వచ్చే వరకు టీఎస్ఆర్టీసీ సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.
Recommended Video


అన్ని డిపోల వద్ద రక్తదాన శిబిరాలు ..
ఆగస్టు 18న మా ఆస్పత్రిలో 7500 యూనిట్లు, ఇతర 75 టీఎస్ఆర్టీసీ డిపోల వద్ద కూడా రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఆర్టీసీ నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పిలుపునిచ్చారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications