అవసరమైతే తెలంగాణ బంద్.. ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ హెచ్చరిక
హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జేఏసీ నేతల ఆగ్రహానికి కారణమవుతోంది. టీఆర్ఎస్ సర్కార్ అనుసరిస్తున్న ధోరణి సరికాదని.. అవసరమైతే తెలంగాణ బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి. ఆర్టీసీ సమ్మెకు ప్రజల సంపూర్ణ మద్దతు ఉందని తెలిపారు. సమ్మె నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడానికి ప్రెస్ క్లబ్లో అఖిల పక్షం సమావేశం నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన పలు అంశాలు ప్రస్తావించారు.
ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ తలపెట్టిన ఆల్ పార్టీ మీటింగ్కు అన్ని రాజకీయ పార్టీల నేతలతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలను ఆహ్వానించారు. ఆ క్రమంలో ఈ భేటీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీజేపీ నుంచి రామచంద్రరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ తదితరులు హాజరయ్యారు. ఆర్టీసీ సమ్మె - ప్రభుత్వ నిర్ణయాలపై ఈ సమావేశంలో చర్చించి అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె జీతాల కోసం కాదని మరోసారి స్పష్టం చేశారు అశ్వత్థామ రెడ్డి. ఇన్నేళ్లుగా ఆర్టీసీని నమ్ముకుని బతుకుతున్న కార్మికులు సంస్థ మనుగడ కోసం ఆరాటపడుతున్నారని చెప్పుకొచ్చారు. అంతేగానీ ప్రభుత్వం చెబుతున్నట్లుగా జీతాల పెంపు కోసం కాదన్నారు. సీఎం కేసీఆర్ చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నారని.. కార్మికులు నెలనెలా దాచుకుంటున్న పీఎఫ్ సొమ్ము చెల్లించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోందని ప్రశ్నించారు.
ఆర్టీసీపై డిజీల్ భారం ఎక్కువైందన్నారు అశ్వత్థామ రెడ్డి. డిజీల్పై 27 శాతం పన్ను వేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. అదలావుంటే ఈ ఐదేళ్లలో ఆర్టీసీలో ఒక్క నియామకమైనా జరిగిందా అంటూ నిలదీశారు. తెలంగాణలో నాలుగో వంతు ప్రజలు రవాణా విషయంలో పూర్తిగా ఆర్టీసీపై ఆధారపడుతున్నారని.. అలాంటి వారంతా సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తున్నారని తెలిపారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications