రెండువర్గాల మధ్య ఘర్షణ, పోలీస్ స్టేషన్ పై దాడి, ఉట్నూర్ లో ఉద్రిక్తత
ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ లో రెండు వర్గాల మద్య ఘర్షణ పోలీస్ స్టేషన్ పై దాడికి కారణమైంది. ఈ ఘటనలో ఎఎస్పీ, డిఎస్పీలకు గాయాలయ్యాయి.
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ లో రెండు వర్గాల మద్య ఘర్షణ పోలీస్ స్టేషన్ పై దాడికి కారణమైంది. ఈ ఘటనలో ఎఎస్పీ, డిఎస్పీలకు గాయాలయ్యాయి. పరిస్థితిని పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
శనివారం నాడు ఓ వర్గాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో వచ్చిన ఆడియో ఘటనపై రెండు వర్గాలు ఒకరిపై మరోకరు దాడికి దిగాయి.
ఉద్దేశ్యపూర్వకంగా తమ వర్గాన్ని కించపరిచేలా చేసిన పోస్టుపై మరో వర్గానికి చెందినవారు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అయినా పోలీసులనుండి సరైన స్పందన లేకపోవడంతో ఆదివారం ఉదయమే పోలీస్ స్టేషన్ పై ఒకవర్గం వారు రాళ్ళదాడికి దిగారు.

ఈ ఘటనతో పోలీసులు గాయపడ్డారు.ఇతర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ఉట్నూర్ కు పోలీస్ బలగాలను రప్పించారు.మరో వైపు రెండు వర్గాలు ఒకరిపై మరోకరు రాళ్ళదాడికి దిగారు.
ఈ దాడులను అదుపుచసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. రాళ్ళదాడిలో ఎస్పీ, ఎఎస్పీ, డిఎస్పీలకు గాయాలయ్యాయి.
విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ బుద్దప్రకాష్ , ఐజీ వర్మలు ఉట్నూర్ కు చేరుకొన్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇరువర్గాలతో డిఐజీ రవివర్మ చర్చిస్తున్నారు. అయితే తప్పు చేసిన వారిని వదిలపెట్టే ప్రసక్తేలేదని రవివర్మ ప్రకటించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications