రెండు పులుల భీకరపోరు: ఓ ఆడపులి మృతి
ఆదిలాబాద్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో రెండు పులులు మధ్య ఘర్షణ పడ్డాయి. ఈ ఘర్షణలో ఓ పులి మరణించింది. సుమారు రెండేళ్ల వయస్సున్న 2 పులులు ఆవాసం కోసం కొట్లాడగా.. ఓ ఆడపులి తీవ్రగాయాలపాలై మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీశాఖ ఉన్నతాధికారులు పోస్టుమార్టం నిర్వహించి.. నమూనాలను ప్రయోగశాలకు పంపించారు.
ఈ ఘటన జరిగి మూడునాలుగు రోజులు అవుతున్నట్లు అధికారులు తెలిపారు. పశువైద్యాధికారుల సమక్షంలో పులి మృతదేహాన్ని ఖననం చేసినట్లు వెల్లడించారు. కాగా, స్థానికంగా పులలు సంచారంతో అక్కడి ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

పులి దాడిలో మహిళ మృతి
తెలంగాణ-మహారాష్ట్ర సరిద్దు గ్రామమైన చింతలపేట్లో పెద్దపులి దాడిలో మహిళ మృతి చెందింది. ఖానాపూర్, మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా అహేరీ పరిధిలో చింతల్ పేట గ్రామంలో ఆదివారం పత్తి తీసేందుకు చేనులోకి వెళ్లిన మహిళపై పెద్దపులి దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ దాడి జరిగిందని స్థానికులు చెప్పారు. మృతి చెందిన మహిళ చింతల్పేట్ కు చెందిన సుష్మా(50)గా గుర్తించారు. సుష్మా గ్రమంలో కిరాణా షాపు నిర్వహిస్తూ కూలి పనులకు వెళ్లేదని స్థానికులు తెలిపారు. పులి బారి నుంచి కాపాడాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications