నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇద్దరు యువతులపై అత్యాచారయత్నం: ఎంపిటీసీ కుమారుడితో సహా మిత్రుడి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: ఇద్దరు బాలికలకు మత్తు మందు ఇచ్చి అపహరించి, ఆ తర్వాత అత్యాచారానికి యత్నించిన సంఘటన నిజామాబాద్‌ జిల్లాలో కలకలం సృష్టించింది. నిజామాబాద్ జిల్లాలోని సదాశివనగర్‌ మండలం రామారెడ్డి గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో స్థానిక ఎంపీటీసీ తనయుడితో పాటు మరో యువకుడు పట్టుబడ్డాడు.

రామారెడ్డికి చెందిన ఇద్దరు 8వ తరగతి చదువుతున్న బాలికలు బుధవారం సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి వెళుతుండగా, గ్రామానికి చెందిన ఎంపీటీసీ నామాల యాదగిరి తనయుడు కిరణ్‌ కుమార్‌, అతడి స్నేహితుడు నితీష్‌ కుమార్‌లు కలిసి బాలికలకు మత్తు మందు ఇచ్చి కిడ్నాప్‌ చేశారు.

Two youths arrested for kidnapping girls

వారిని ధర్మారం చెరువు సమీపంలోని పౌల్ట్రీఫారం వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించారు. అయితే, మత్తులో ఉన్న బాలికలు స్పృహలోకి వచ్చి కేకలు వేయడంతో పక్కనే ఉన్న స్థానికులు వచ్చి బాలికలను రక్షించారు. ఇద్దరినీ బైక్‌తో సహా పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు.

బాలికలను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితులపై కిడ్నాప్‌తో పాటు నిర్భయ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అందులో ఒకరు ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వహిస్తూ సంక్రాంతి పండుగ కోసం గ్రామానికి వచ్చిన కిరణ్‌కుమార్ అని గుర్తించారు.

English summary
Two youths arrested for kidnapping two girls and attempted to rape in Nizamabad district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X