చంద్రబాబూ! ఇదీ పరిస్థితి, అర్థం చేసుకోండి: టీడీపీకి ఉమామాధవరెడ్డి రాజీనామా
హైదరాబాద్: మాజీ మంత్రి ఉమా మాధవ రెడ్డి బుధవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు పంపించారు. ఆమె గురువారం అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరనున్న విషయం తెలిసిందే.
Recommended Video
తన కొడుకు సందీప్ రెడ్డితో కలిసి ఆమె టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు మంగళవారం వార్తలు వచ్చాయి. అంతలోనే ఆమె బుధవారం తన రాజీనామా లేఖను అధినేతకు పంపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు తనకు పార్టీలో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.
టీడీపీకి మరో షాక్, అలా చెప్పిన కొన్నాళ్లకే: టీఆర్ఎస్లోకి ఉమామాధవ రెడ్డి, కొడుకు
గత్యంతరం లేకే పార్టీని వీడుతున్నా
ఉమా మాధవ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తన రాజీనామాకు గల కారణాలను ఆమె అధినేతకు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో గత్యంతరం లేకే తాను టీడీపీని వీడుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.
మాకు పార్టీలో, ప్రభుత్వంలో గౌరవం ఇచ్చారు
ప్రస్తుత పరిస్థితుల్లో తమ పరిస్థితి అర్థం చేసుకుంటారని తాను భావిస్తున్నానని ఉమా మాధవ రెడ్డి అన్నారు. తెలంగాణలోని పరిస్థితులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని కూడా పేర్కొన్నారని తెలుస్తోంది. నాకు పార్టీలో, ప్రభుత్వంలో పదవులు ఇచ్చి గౌరవించారన్నారు. తమకు దశాబ్దాలుగా టీడీపీతో అనుబంధం ఉందని చెప్పారు.
టీఆర్ఎస్లోకి వెళ్తారని
కాగా, ఉమా మాధవ రెడ్డి, ఆమె తనయుడు సందీప్ రెడ్డి టీడీపీని వీడుతారని, తెలుగుదేశం పార్టీలో చేరుతారని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. మంగళవారం తొలుత సందీప్ రెడ్డి 14వ తేదీన కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరుతారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఉమ కూడా చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. మరుసటి రోజే ఆమె రాజీనామా చేశారు.
టిక్కెట్ పైన హామీ
కాగా, ఉమా మాధవ రెడ్డికి భువనగిరి టిక్కెట్ విషయంలో తెరాస నుంచి హామీ వచ్చినందువల్లే అధికార పార్టీలో చేరుతున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె లేదా ఆమె తనయుడు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.