ఓటుకు నోటులో ఎసిబి ఎదుట వేం కొడుకు కృష్ణ: బెంగళూరులో టెక్కీ
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వేం నరేందర్ రెడ్డి తనయుడు కృష్ణ కీర్తన్ రెడ్డి బుధవారం నాడు ఎసిబి ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయనకు ఎసిబి మంగళవారం సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చింది. దీంతో ఆయన బుధవారం విచారణకు హాజరయ్యారు.
ఓటుకు నోటు కేసులో ఎ1గా రేవంత్ రెడ్డి, ఎ2 సెబాస్టియన్, ఎ3 ఉదయ్ సిన్హా, ఎ4 జెరూసలేం మత్తయ్య ఉన్నారు. సండ్ర వెంకట వీరయ్యను ఎ5గా పేర్కొన్నారు.
కాగా, కేసులో లభించిన ఫోన్ సంభాషణలను ఫోరెన్సిక్ ల్యాబ్లో పరీక్షించిన మీదట ఎసిబికి పలు కీలక ఆధారాలు లభించినట్లుగా తెలుస్తోంది. కేసులో కీలక వ్యక్తుల ప్రమేయం వెల్లడైందని తెలుస్తోంది. ఈ ఆధారాలతో విచారణ నిమిత్తం కృష్ణ కీర్తన్కు నోటీసులు జారీ చేసిందని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, కృష్ణ కీర్తన్.. వేం నరేందర్ రెడ్డి తనయుడు. అతను సాఫ్టువేర్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు.
వేం నరేందర్ రెడ్డిని ఇంతకుముందే అధికారులు విచారించారు. కృష్ణ కీర్తన్ నుంచి అధికారులు మరిన్ని విషయాలు రాబట్టనున్నారని తెలుస్తోంది. అతను రేవంత్, ఉదయ్ సిన్హాలతో మాట్లాడినట్లుగా ఎసిబి అధికారులు గుర్తించారని సమాచారం.
-
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications