రెచ్చిపోయిన వీహెచ్.. గాంధీ భవన్ ను షేక్ చేసిన వ్యాఖ్యలు..! బిత్తరపోయిన సొంత పార్టీ నేతలు!
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు మరో సారి రెచ్చిపోయారు. కాంగ్రెస్ పార్టీలో నేతల తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. గాంధీభవన్లో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో పార్టీ నేతల తీరును ఆయన కడిగిపారేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్న సమాచారం తెలిసినప్పుడే దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా... వాళ్లంతా వెళ్లిపోయాక సమావేశాలు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? అని ప్రశ్నించారు.
19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారకముందే పిలిచి మాట్లాడి ఉండాల్సిందని హితవుపలికారు. అంతా అయిపోయాక సమావేశాలు పెట్టడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదన్నారు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఒక్కడే తిరగడమేంటి? అని నిలదీశారు. సీనియర్ నాయకులను కలుపుకుని వెళ్లాల్సిన అవసరం లేదా? అని అడిగారు.

పార్టీ క్యాడర్కు ఏం సంకేతాలు ఇస్తున్నారని రుసరుసలాడారు. అసెంబ్లీ టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా ఇలానే చేశారన్నారు. మనవాళ్లను పంపేసి.. కొత్త వాళ్లను తీసుకోవడమేంటన్నారు. వేరే పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన కొంతమందికి అధిష్టానం టికెట్లు ఇవ్వడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆదిలాబాద్, పెద్దపల్లి, కోరుట్లలో కూడా ఒకే సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చారని.. ఇలా ఎందుకు చేశారని నిలదీశారు.
పార్టీకి నష్టం చేకూర్చేలా ఇలా ఎందుకు చేస్తున్నారని ఆవేశంగా మాట్లాడి.. సమావేశం నుంచి అర్థాంతరంగా లేచిపోయి ఇందిరాపార్కులో జరుగుతున్న ధర్నాకు వెళ్లిపోయారు. కాగా సొంత పార్టీపై వీహెచ్ చేసిన వ్యాఖ్యలతో నేతలు కంగుతిన్నారు. అసలు ఆయన మాటల వెనుక ఆంతర్యమేంటి..? ఎవరిని ఉద్దేశించి ఆయన పరోక్షంగా మాట్లాడారు.? అని సొంత పార్టీ నేతలు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications