శిరీష కేసు: కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట గ్రామస్థుల ధర్నా, ఎందుకంటే?
కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద కొందరు గ్రామస్తులు గురువారంనాడు ఆందోళన చేశారు. బ్యూటీషీయన్ శిరీష , ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యల విషయంలో పోలీసులు కేసును తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని
హైదరాబాద్:కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద కొందరు గ్రామస్తులు గురువారంనాడు ఆందోళన చేశారు. బ్యూటీషీయన్ శిరీష , ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యల విషయంలో పోలీసులు కేసును తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు.
ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకొన్న రోజునే గ్రామస్థులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. అంతేకాదు ఎస్ఐ పై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారనే నెపంతో ఓ మీడియా వాహనంపై దాడికి దిగారు.

ఎస్ఐ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కేసును తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు ఆనాడు ఆరోపించారు. మరోవైపు ఇవాళ కూడ గ్రామస్థులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.
బ్యూటీషీయన్ శిరీష కేసులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. శిరీష ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి క్వార్టర్ కు వెళ్ళలేదని గ్రామస్థులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
అయితే కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ లో ఈ నెల 1వ, తేది నుండి సీసీటీవి పుటేజీ లభించకపోవడం కూడ పోలీసులకు ఇబ్బందిగా మారింది. హార్డ్ డిస్క్ నుండి సీసీటీవి డేటా ను రికవరీ చేసేందుకు ఐటీ నీపుణుల సహయం తీసుకొంటున్నారు పోలీసులు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications