ఆ హమీని కెసిఆర్ నెరవేర్చలేదు, దళిత ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయించారు: ఉత్తమ్
హైదరాబాద్: దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఇచ్చిన హమీని ముఖ్యమంత్రి కెసిఆర్ తుంగలో తొక్కారని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయించి దళితులపై తనకు ఏ పాటి ప్రేమ ఉందో కెసిఆర్ నిరూపించుకొన్నాడని ఉత్తమ్ ఎద్దేవా చేశారు.
దళితులపై దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షల్లో భాగంగా హైద్రాబాద్ గాంధీభవన్ ఎదుట సోమవారం నాడు జరిగిన దీక్షలో రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ కుంతియాతో పాటు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రెండు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు , ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.

దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై అనేక దాడులు చోటు చేసుకొన్నాయని ఉత్తమ్కుమార్ రెడ్డి ఆరోపించారు. వందలాది మంది దళితులను బిజెపి పొట్టనపెట్టుకొందన్నారు. తెలంగాణలో దళితులకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ మార్చిపోయారని గుర్తు చేశారు. మంథనిలో దళితులపై దాడులు జరిగాయని అయినా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన్నట్లు ఉందన్నారు. దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ హామీ కాగితాలకే పరిమితమైందన్నారు. . శాసనసభలో దళితుల గురించి మాట్లాడకుండా దళిత ఎమ్మెల్యే సంపత్ కుమార్ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయించారని ఆయన ఆరోపించారు.
టిడిపి, టిఆర్ఎస్, వైసీపీలకు ఓటేస్తే బిజెపికి ఓటేసినట్టేనని కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి అభిప్రాయపడ్డారు. విభజించు పాలించు అనే సిద్దాంతం ఆధారంగా మోడీ పాలన సాగిస్తున్నారని రఘువీరారెడ్డి ఆరోపించారు. బ్రిష్ విధానాన్ని ఆయన అమలు చేస్తున్నాడన్నారు. అన్నివర్గాలకు సమాన హక్కులు కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీనని అన్నారు. బీజేపీ దళితులను, మైనారిటీలను ద్వేషిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రేమిస్తుందని చెప్పారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications