ఓ వ్యక్తితో సహజీవనం, మరో వ్యక్తితో ఇంట్లో మహిళ!: చంపేశాడు
హైదరాబాద్: సహజీవనం చేస్తూనే మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న కారణంతో ఓ మహిళను హత్య చేసిన సంఘటన లాలాగూడ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలానికి చెందిన కమలమ్మ భర్త పాండ్యాతో కలిసి హైదరాబాద్ వచ్చింది.
తార్నాకలోని లంబడి బస్తీలో స్థిరపడ్డారు. భర్త పది సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఆమెకు నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు. కూతుళ్ల పెళ్లి అయింది. ఈమె వెంకటరమణా రెడ్డి అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఆమెకు పిల్లలు దూరంగా ఉంటున్నారు.
పాత లాలాపేటలో గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఆమె ప్రవర్తన పైన వెంకట రమణా రెడ్డికి అనుమానం వచ్చింది. నిలదీశాడు. ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో.. అతను గొంతు నులిమి చంపేశాడు. గురువారం ఓ కూతురు ఫోన్ చేయగా.. చంపేశానని వెంకటరమణ రెడ్డి చెప్పాడు.
కాగా, మరో బుధవారం రాత్రి వెంకట రమణ రెడ్డి ఇంటికి వచ్చేసరికి మరో వ్యక్తితో ఉండటం చూశాడని, అది చూసి తట్టుకోలేక ఆమెతో వాగ్వాదానికి దిగాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కూతురు, ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.