ప్రపంచ పర్యాటక కేంద్రంగా యాదగిరిగుట్ట.. ఆ నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు

తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం త్వరలోనే అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక-పర్యాటక కేంద్రంగా మారబోతుంది. యాదగిరిగుట్టను గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ కార్యాచరణను సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న "రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి ప్రత్యేక సాయం పథకం" కింద దాదాపు రూ.500 కోట్ల వ్యయంతో కూడిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది.

యాదాద్రికి లక్షలాది మంది భక్తుల రాక

కేంద్రం నుంచి వచ్చే ఈ ప్రత్యేక నిధులతో యాదాద్రి క్షేత్రానికి సరికొత్త మహార్దశ పట్టనుంది. యాదాద్రి ప్రధాన ఆలయ పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా వీకెండ్స్, పండుగ రోజుల్లో లక్షలాది మంది తరలివస్తున్నారు. అయితే, ఈ స్థాయి రద్దీకి తగినట్లుగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వసతి గృహాలు, రవాణా సౌకర్యాలు, కాటేజీలు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు.

Yadagirigutta temple premises to Become Global Tourism Hub with Rs 500 Crore central govt scheme

పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాలను ఇస్తున్న కేంద్రం

గతంలో నిధుల కొరత కారణంగా కేవలం ఆలయ నిర్మాణం, ల్యాండ్‌స్కేప్ గార్డెన్లు, ప్రధాన రహదారులకే ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టను సందర్శించి, భక్తులకు కల్పిస్తున్న మౌలిక వసతులపై ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాల రూపంలో ఈ మూలధన పెట్టుబడి సహాయాన్ని అందిస్తోంది.

యాదగిరిగుట్టలో అభివృద్ధి చేసే పనుల ప్రతిపాదనలు ఇవే

ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని యాదగిరిగుట్టతో పాటు బౌద్ధ సంస్కృతికి నిలయమైన నాగార్జునసాగర్ 'బుద్ధవనం', అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న వికారాబాద్ 'అనంతగిరి కొండలను' కూడా ఈ పథకం కింద అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతిపాదిత రూ.500 కోట్ల నిధులతో యాదగిరిగుట్టలో కొండ చుట్టూ ఆధునిక రింగ్ రోడ్ల నిర్మాణం మరియు విశాలమైన మల్టీ-లెవెల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

హైదరాబాద్ మెట్రో విస్తరణ అడ్డుకుంటుంది ఆయనే: భగ్గుమన్న సీఎం రేవంత్!
హైదరాబాద్ మెట్రో విస్తరణ అడ్డుకుంటుంది ఆయనే: భగ్గుమన్న సీఎం రేవంత్!

ప్రపంచ ఆధ్యాత్మిక పటంలో ప్రత్యేక గుర్తింపు కోసం ప్రభుత్వ నిర్ణయం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొండపైకి వెళ్లే భక్తుల కోసం ఎలక్ట్రిక్ వాహనాల సేవలను విస్తరించాల్సి ఉంది. అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేలా డిజిటల్ గైడెన్స్ వ్యవస్థలు, అత్యాధునిక పర్యాటక సమాచార కేంద్రాల స్థాపన చేయాల్సి ఉంది. దేశ, విదేశీ భక్తుల సౌకర్యార్థం ఫైవ్ స్టార్ రేటింగ్ వసతులతో కూడిన కాటేజీలు, భారీ కన్వెన్షన్ సెంటర్లు మరియు మల్టీ-క్యూసిన్ రెస్టారెంట్ల నిర్మాణం చేయాల్సి ఉంది. యాదగిరిగుట్ట, ఈ నూతన అంతర్జాతీయ మౌలిక వసతుల కల్పన ద్వారా ప్రపంచ ఆధ్యాత్మిక పటంలో ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+